NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Uttarkashi: డ్రిల్లింగ్ సమయంలో విరిగిన అగర్ మెషిన్.. రెస్క్యూ ఆపరేషన్ మరింత ఆలస్యం
    తదుపరి వార్తా కథనం
    Uttarkashi: డ్రిల్లింగ్ సమయంలో విరిగిన అగర్ మెషిన్.. రెస్క్యూ ఆపరేషన్ మరింత ఆలస్యం
    Uttarkashi: డ్రిల్లింగ్ సమయంలో విరిగిన అగర్ మెషిన్.. రెస్క్యూ ఆపరేషన్ మరింత ఆలస్యం

    Uttarkashi: డ్రిల్లింగ్ సమయంలో విరిగిన అగర్ మెషిన్.. రెస్క్యూ ఆపరేషన్ మరింత ఆలస్యం

    వ్రాసిన వారు Stalin
    Nov 26, 2023
    12:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తరాఖండ్‌ ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్‌లో 14 రోజులుగా 41 మంది కూలీలు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. కార్మికులను రక్షించేందుకు కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది.

    మరికొన్ని రోజుల్లో కార్మికులు బయటకు వస్తారు అనుకుంటే.. మరో ఎదురుదెబ్బ తగిలింది. సొరంగానికి డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో ఆగర్ డ్రిల్లింగ్ మెషిన్ విరిగిపోయింది.

    దీంతో రెస్క్యూ ఆపరేషన్‌ మరోసారి నిలిచిపోయింది. ఫలితంగా రెస్క్యూ ఆపరేషన్‌ మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

    కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రత్యామ్నాయ ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు.

    క్రిస్మస్ నాటికి కార్మికులు తమ కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు తెలిపారు.

    ఉత్తరకాశీ

    ఆగర్ యంత్రం బ్లేడ్ ఎలా విరిగింది?

    కొన్ని రోజులుగా హెవీ ఆగర్‌ యంత్రం డ్రిల్లింగ్‌ చేస్తోంది. డ్రిల్లింగ్ సమయంలో కొన్నిసార్లు ఇనుప కడ్డీలు అడ్డువచ్చాయి.

    ఈ క్రమంలో మిషన్ బ్లేడ్‌కు మరమ్మతులు ఏర్పడి.. చాలా సార్లు డ్రిల్లింగ్‌కు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఆ తర్వాత యంత్రాన్ని మరమ్మతు చేసి మళ్లీ, డ్రిల్లింగ్ చేసిన సందర్భంగా అనేకం ఉన్నాయి.

    అయితే తాజాగా డ్రిల్లింగ్ యంత్రం బ్లేడ్ ఇనుప రాడ్లలో ఇరుక్కుని పైపులో విరిగిపోయింది. దీంతో ప్రస్తుతం ఇరుక్కుపోయిన యంత్రాన్ని బయటకు తీస్తున్నారు.

    ఇదిలా ఉంటే, రెస్క్యూ ఆపరేషన్‌పై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. సొరంగం నుంచి కార్మికులను తరలించేందుకు అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు.

    ఉత్తరకాశీ

    మాన్యువల్ డ్రిల్లింగ్ ఎంత సమయం పడుతుంది?

    రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి మరో 10మీటర్లు మాత్రమే డ్రిల్లింగ్ మిగిలి ఉంది. దీంతో కార్మికులను రక్షించడానికి మాన్యువల్ డ్రిల్లింగ్ పద్ధతిని అధికారులు ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

    అయితే, మెషిన్ డ్రిల్లింగ్‌తో పోలిస్తే మాన్యువల్ డ్రిల్లింగ్‌కు అదనంగా 18-24 గంటల సమయం పట్టవచ్చు.

    కార్మికులను బయటకు తీసుకొచ్చేందకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్లు అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్ అంటున్నారు.

    మాన్యువల్ డ్రిల్లింగ్ ఆదివారం ప్రారంభం అవుతుందని అధికారులు అంటున్నారు.

    ఆగర్ మిషన్ రోటరీ బ్లేడ్‌లను తొలగించేందుకు హైదరాబాద్‌ నుంచి ప్లాస్మా కట్టర్‌ను విమానంలో రప్పిస్తున్నట్లు ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి తెలిపారు.

    సొరంగం ప్రవేశద్వారం వద్ద నలభై ఒక్క అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయి. కార్మికులను చిన్యాలిసౌర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తరాఖండ్
    తాజా వార్తలు

    తాజా

    2025 Suzuki V-Strom 800DE: భారత్ లో విడుదలైన 2025 సుజుకి V-స్ట్రోమ్ 800DE.. రూ.10,30,000 ఎక్స్-షోరూమ్ ధర ఆటో మొబైల్
    Elon Musk: కొత్త పార్టీ పెట్టేందుకు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. మస్క్ పెట్టిన పోల్‌కు భారీ రెస్పాన్స్..  ఎలాన్ మస్క్
    Chenab bridge: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చినాబ్ వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ ..  నరేంద్ర మోదీ
    Home loan: గృహ రుణాలదారులకు ఊరట.. వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్‌బీఐ  ఆర్ బి ఐ

    ఉత్తరాఖండ్

    ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్న బైక్ ఢీకొని 9ఏళ్ల బాలుడి మృతి బైక్
    ఆసియాలోనే అతిపెద్ద లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ఆవిష్కరణ; అది ఎలా పని చేస్తుందంటే? టెలిస్కోప్
    ఉత్తరాఖండ్: భారత మొదటి గ్రామం 'మాణా' స్వాగత బోర్టు ఏర్పాటు పుష్కర్ సింగ్ ధామి
    కారుణ్య మరణానికి సిద్దపడ్డ జ్ఞాన్‌వాపి మసీదు కేసు మాజీ పిటిషనర్; రాష్ట్రపతికి లేఖ  తాజా వార్తలు

    తాజా వార్తలు

    Uttar Pradesh: అత్యాచారం కేసులో బాధితురాలుగా ఉన్న యువతిని నరికి చంపిన నిందితులు ఉత్తర్‌ప్రదేశ్
    FEMA ఉల్లంఘనల కేసులో రూ.9,000కోట్లు చెల్లించాలని బైజూస్‌కు ఈడీ నోటుసులు  బైజూస్‌
    Pushkar Mela: వీర్యంతోనే నెలకు లక్ష్లలో సంపాదన.. 150 దూడలకు జన్మ.. ఈ దున్న ధర ఎన్నికోట్లంటే!  పుష్కర్
    Thrissur school: చదువుకునే రోజుల్లో అలా చేసారని.. టీచర్లపై పూర్వ విద్యార్థి కాల్పులు  కేరళ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025