Page Loader
Ayodhya Ram Temple: అయోధ్య తీర్పు చెప్పిన ఐదుగురు జడ్జిలు ఎవరు? ఇప్పుడు ఏం చేస్తున్నారు?
Ayodhya Ram Temple: అయోధ్య తీర్పు చెప్పిన ఐదుగురు జడ్జిలకు ఎవరు? ఇప్పుడు ఏం చేస్తున్నారు?

Ayodhya Ram Temple: అయోధ్య తీర్పు చెప్పిన ఐదుగురు జడ్జిలు ఎవరు? ఇప్పుడు ఏం చేస్తున్నారు?

వ్రాసిన వారు Stalin
Jan 20, 2024
05:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్‌కి దేశవ్యాప్తంగా చాలా మంది ప్రత్యేక వ్యక్తులను ఆహ్వానించారు. ప్రత్యేక ఆహ్వానితుల్లో2019లో అయోధ్య భూ వివాదంలో అయోధ్యలో రామాలయ నిర్మాణానికి అనుకూలంగా తీర్పు చెప్పిన ఐదుగురు సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ఉన్నారు. వీరి తీర్పుతోనే ఏళ్ల నాటి వివాదానికి తెరపడింది. అనంతరం రామ మందర నిర్మాణానికి తెరపడింది.. ఇప్పుడు ఆ గుడి ప్రారంభం కాబోతోంది. అయితే నాడు చారిత్రాత్మ తీర్పు ఇచ్చిన ఆ జడ్జిలు ఎవరు? ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసుకుందాం.

అయోధ్య

జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసం

మాజీ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం రామాలయానికి సంబంధించిన తీర్పును ఇచ్చింది. జస్టిస్ గొగోయ్ బెంచ్‌లో జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ సభ్యులుగా ఉన్నారు. ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని రామాలయ జన్మస్థలంగా భావించి హిందూ పక్షానికి అప్పగించింది. ఆ భూమిలోనే ఇప్పుడు ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఆలయాన్ని నిర్మించేందుకు ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. అలాగే బాబ్రీ మసీదు తరహాలో మరో మసీదును నిర్మించేందుకు వీలుగా ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు ప్రత్యేకంగా 5 ఎకరాల భూమిని కేటాయించాలని యూపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

అయోధ్య

రంజన్ గొగోయ్ ఇప్పుడు ఎక్కడున్నారంటే..

దేశ 46వ సీజేఐ రంజన్ గొగోయ్.. అయోధ్య తీర్పు ఇచ్చిన వారం రోజులకే పదవీ విరమణ చేశారు. మార్చి 16, 2020న అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జస్టిస్ గొగోయ్‌ను రాజ్యసభకు నామినేట్ చేశారు. దీంతో రాజ్యసభకు ఎంపికైన మూడో న్యాయమూర్తిగా, రాష్ట్రపతి నామినేట్ చేసిన మొదటి న్యాయమూర్తిగా ఆయన నిలిచారు. ప్రసుతం గొగోయ్ విదేశీ వ్యవహారాలు, సమాచార మరియు కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో కూడా సభ్యుడు. అయితే గొగోయ్ ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలో లేరు. ఏ పార్టీలో చేరే ఉద్దేశం తనకు లేదని గొగోయ్ చెప్పారు.

అయోధ్య

జస్టిస్ బోబ్డే, జస్టిస్ భూషణ్ 

గొగోయ్ పదవీ విరమణ తర్వాత శరద్ అరవింద్ బాబ్డే నవంబర్ 18, 2019న దేశ 47వ సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు. సుమారు 17 నెలల పాటు ఈ పదవిని నిర్వహించిన తర్వాత, అతను ఏప్రిల్ 2021లో పదవీ విరమణ చేసారు. ప్రస్తుతం మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్శిటీ, ముంబై, మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ, నాగ్‌పూర్‌లకు వైస్ ఛాన్సలర్‌గా పని చేస్తున్నారు. జస్టిస్ అశోక్ భూషణ్ జస్టిస్ అశోక్ భూషణ్ జూలై 4, 2021న పదవీ విరమణ చేశారు. నవంబర్ 2021లో కేంద్ర ప్రభుత్వం ఆయనను NCLAT ఛైర్మన్‌గా నియమించింది. దాదాపు నాలుగేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.

అయోధ్య

ప్రస్తుతం సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్

రామాలయానికి సంబంధించిన తీర్పును వెలువరించిన ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్న చంద్రచూడ్ ఇప్పుడు సీజేఐగా ఉన్నారు. ఈయన దేశానికి 50వ సీజేఐ. ఆ బెంచ్‌లోని 5 మంది న్యాయమూర్తులలో నలుగురు పదవీ విరమణ చేశారు. జస్టిస్ చంద్రచూడ్ మాత్రమే ఇంకా పదవిలో ఉన్నారు. ఆయన పదవీకాలం నవంబర్ 2024 వరకు ఉంది. ఎవరైనా 2 సంవత్సరాల పాటు సీజేఐగా పదవిలో కొనసాగుతారు. కానీ రెండేళ్లకు మించి జస్టిస్ చంద్రచూడ్ సీజేఐగా ఉండటం గమనార్హం. చంద్రచూడ్ తండ్రి జస్టిస్ వైవీ చంద్రచూడ్ కూడా ఆయన సమయంలో ఎక్కువ కాలం సీజేఐగా పనిచేశారు.

అయోధ్య

ఏపీ గవర్నర్‌గా జస్టిస్ నజీర్ గవర్నర్‌

జస్టిస్ నజీర్ కూడా అయోధ్య తీర్పు చెప్పిన ప్యానెల్‌లో ఉన్నారు. జనవరి 4, 2023న ఆయన పదవీ విరమణ చేశారు. ఒక నెల తర్వాత కేంద్ర ప్రభుత్వం జస్టిస్ నజీర్‌ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమించింది. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ 24వ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. అయోధ్య కేసులో తీర్పు వెలువరించిన ఐదుగురు న్యాయమూర్తులలో జస్టిస్ నజీర్ ఒక్కరే ముస్లిం న్యాయమూర్తి కావడం గమనార్హం. నజీర్‌ను గవర్నర్‌గా చేయడంపై అప్పట్లో రాజకీయ వివాదం కూడా జరిగింది.