LOADING...
Komatireddy Venkat Reddy: ఇకపై ఎలాంటి పెంపు ఉండదు.. సినిమా టికెట్ ధరలపై కోమటిరెడ్డి స్పష్టత
ఇకపై ఎలాంటి పెంపు ఉండదు.. సినిమా టికెట్ ధరలపై కోమటిరెడ్డి స్పష్టత

Komatireddy Venkat Reddy: ఇకపై ఎలాంటి పెంపు ఉండదు.. సినిమా టికెట్ ధరలపై కోమటిరెడ్డి స్పష్టత

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 12, 2025
05:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో సినిమా టికెట్ ధరలపై ఇకపై ఎలాంటి పెంపులు ఉండవని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. 'అఖండ-2'చిత్రం టికెట్ రేట్ల పెంపు చుట్టూ నెలకొన్న వివాదం నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు విశేష ప్రాముఖ్యత పొందాయి. భవిష్యత్తులో టికెట్ ధరలను పెంచాలని కోరుతూ ఎలాంటి నిర్మాతలు, దర్శకులు తన వద్దకు రావద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తుందని, సామాన్య ప్రజలకు భారం కాకుండా నిర్ణయాలు తీసుకుంటామని కోమటిరెడ్డి తెలిపారు. హీరోలకు వందల కోట్ల పారితోషికం ఇచ్చి, ఆ ఖర్చు భారాన్ని ప్రజలపై మోపడం సరికాదు. టికెట్ ధరల పెంపుపై ఒత్తిడిని ప్రభుత్వం వద్దకు తేవడాన్ని మేము అనుమతించమని ఆయన స్పష్టం చేశారు.

Details

ప్రత్యేక షోలకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ

సాధారణ కుటుంబం కూడా థియేటర్‌కు వెళ్లి సినిమా చూడగలగాలి అన్న దృష్టితో ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పారు. ఈసారి 'అఖండ-2' కేసులో పొరపాటు జరిగిందని, భవిష్యత్తులో అలాంటి పరిస్థితి పునరావృతం కాదని ఆయన స్పష్టం చేశారు. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'అఖండ-2' సినిమా టికెట్ రేట్ల పెంపు, ప్రత్యేక షోలకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేసింది. అయితే ఆ తీర్పుపై సవాలు చేయగా, డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ నిర్ణయాన్ని కొట్టివేసింది. దీంతో పెంచిన టికెట్ రేట్లు రాష్ట్రవ్యాప్తంగా యథావిధిగా అమల్లోకి వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే మంత్రి కోమటిరెడ్డి భవిష్యత్తులో టికెట్ ధరలపై ప్రభుత్వ విధానాన్ని స్పష్టంగా వెల్లడించారు.

Advertisement