NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CM Chandrababu: టీడీపీని అంతమొందిస్తామని చెప్పినవారే కాలగర్భంలో కలిశారు : చంద్రబాబు
    తదుపరి వార్తా కథనం
    CM Chandrababu: టీడీపీని అంతమొందిస్తామని చెప్పినవారే కాలగర్భంలో కలిశారు : చంద్రబాబు
    టీడీపీని అంతమొందిస్తామని చెప్పినవారే కాలగర్భంలో కలిశారు : చంద్రబాబు

    CM Chandrababu: టీడీపీని అంతమొందిస్తామని చెప్పినవారే కాలగర్భంలో కలిశారు : చంద్రబాబు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 29, 2025
    12:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ వేడుకలు నిర్వహించగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించారు.

    ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ కుటుంబ సభ్యులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలని పార్టీకి మద్దతుగా నిలిచే ప్రజలకు, అభిమానులకు తన హృదయపూర్వక ధన్యవాదాలని తెలిపారు.

    టీడీపీ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిందని, ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్‌ పార్టీని స్థాపించగా, తాను ఆత్మ విశ్వాసంతో ముందుకు నడిచానని అన్నారు.

    Details

    తొమ్మిది నెలలకే ఆధికారంలోకి వచ్చింది

    టీడీపీ ఏర్పాటు చేసిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఒక ఆదర్శం కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

    ఎన్టీఆర్ లాంటి నాయకుడు మరొకరు పుట్టరన్నారు. టీడీపీని అంతమొందిస్తామని అనేక మంది చెప్పారని, అయితే వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారని చంద్రబాబు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

    క్షేత్రస్థాయిలో పని చేసిన వారికే పదవులు దక్కుతాయని ఆయన స్పష్టం చేశారు.

    గత 43 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న టీడీపీ, అనేక పార్టీలు వచ్చి కనుమరుగయ్యాయని, అయితే టీడీపీ మాత్రం 'స్వర్ణయుగం' అంటూ అభివర్ణించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు

    తాజా

    Hyderabad Metro: నేటి నుంచి మెట్రో ఛార్జీల్లో పెంపు.. ప్రయాణికులకు అదనపు భారం మెట్రో స్టేషన్
    Operation Sindoor: 'ఆపరేషన్‌ సిందూర్‌' ప్రభావంతో మాకు నష్టం వాటిల్లింది.. అంగీకరించిన పాక్ ప్రధాని పాకిస్థాన్
    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం

    చంద్రబాబు నాయుడు

    Drone city': చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. ఆంధ్ర ప్రదేశ్ 'డ్రోన్ సిటీ'..  భారతదేశం
    Chandrababu: జాబ్స్ అడగడం కాదు, ఇచ్చే స్థితిలో ఉండాలి : చంద్రబాబు ఆంధ్రప్రదేశ్
    Supreme Court: సీఎం చంద్రబాబుపై కేసులు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం  ఆంధ్రప్రదేశ్
    Cm Chandrababu : తల్లికి వందనం,అన్నదాత సుఖీభవ పథకాలపై చంద్రబాబు కీలక ప్రకటన భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025