NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / నేటి నుంచి ఏపీలో వర్షాలు..తెలంగాణకు మరో 3 రోజుల పాటు తీవ్ర ఎండలు
    తదుపరి వార్తా కథనం
    నేటి నుంచి ఏపీలో వర్షాలు..తెలంగాణకు మరో 3 రోజుల పాటు తీవ్ర ఎండలు
    ఏపీలో వర్షం కురిసే అవకాశం

    నేటి నుంచి ఏపీలో వర్షాలు..తెలంగాణకు మరో 3 రోజుల పాటు తీవ్ర ఎండలు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 19, 2023
    09:54 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎప్పుడూ లేని రీతిలో నైరుతి రుతుపవనాలు అటు అన్నదాతలను, ఇటు సాధారణ ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి.

    ఒక్క కేరళనే కాదు, ఏకంగా దక్షిణ భారతదేశం అంతటా వర్షాలు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. దీని కారణంగా ఈ ఏడు పంటల దిగుబడి బాగా తగ్గిపోయి ఇబ్బందులు ఎదుర్కొనే దుస్థితి తలెత్తనుంది.

    గుజరాత్ ను ముప్పతిప్పలు పెట్టిన బిపర్‌జాయ్ తుఫాను నైరుతి రుతుపవనంపై పెను ప్రభావమే చూపించింది. వాతావరణంలో వేడి ఉష్ణోగ్రత స్థిరంగా కొనసాగుతుండటం వల్ల చల్లదనం మాయమై నైరుతి కదలిక ఆగిపోయింది. దీంతో వానలు కురవడం లేదు.

    ప్రస్తుతానికైతే బిపర్‌జాయ్ తుపాను ప్రభావం తగ్గిపోయింది కనుక రుతుపవనాలు చురుగ్గా కదిలి వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు.

    DETAILS

    ఏపీలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు 

    ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో ఇవాళ్టి నుంచి తేలికపాటితో కూడిన మోస్తరు వర్షాలు కురువనున్నట్లు వాతావరణ అధికారులు అంచనా వేశారు.

    అటు కోస్తా ప్రాంతంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడే అవకాశముందని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఆంధ్ర ప్రాంతాంలోని కొన్ని జిల్లాల్లో వేడిగాలులు, అధిక ఉష్ణోగ్రతలు మరింత కాలం కొనసాగనున్నట్లు పేర్కొన్నారు.

    ఇక తెలంగాణ విషయానికొస్తే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధిక వేడి వాతావరణంతో ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే చాలా తక్కువ ప్రాంతాల్లో నేటి నుంచి తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం అధికారులు అంచనా వేశారు.

    DETAILS

    తెలంగాణ ప్రజలకు వాతావరణం అలెర్ట్.. బయటకు వెళ్లొద్దని అధికారుల సూచన

    తెలంగాణలో వడగాలులు, అధిక ఉష్ణోగ్రతలు మరో 3 రోజుల వరకు కొనసాగనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

    ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత వరకూ ఎండ సమయంలో బయట పనులకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.

    అయితే రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు మాత్రం భారత వాతావరణ విభాగం ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, వరంగల్, భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నల్గొండ, సూర్యాపేట, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లోని ప్రజలు వీలైనంత వరకు ఇళ్లు దాటకూడదన్నారు.

    మరోవైపు నైరుతి జోరందుకోవడంతో కేరళలోని పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కిలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ
    వర్షాకాలం
    నైరుతి రుతుపవనాలు

    తాజా

    GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం ఐపీఎల్
    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్.. మాకే ముందస్తు ఎన్నికలు అక్కర్లేదు: మంత్రి పెద్దిరెడ్డి ముఖ్యమంత్రి
    గుంటూరు; రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, 20 మందికి గాయాలు  గుంటూరు జిల్లా
    పోలవరం జలాశయంలో కుంగిన స్పిల్ వే గైడ్ బండ్... హుటాహుటిన సీడబ్ల్యూసీ సమీక్ష పోలవరం
    కర్నూలులో పొలం దున్నుతున్న రైతుకు దొరికిన రూ.2కోట్ల వజ్రం  కర్నూలు

    తెలంగాణ

    Telangana Formation Day 2023: తెలంగాణ పదేళ్ల సంబరం; ఉద్యమ చరిత్రను ఓసారి స్మరించుకుందాం  తెలంగాణ రాష్ట్ర సమితి/ టీఆర్ఎస్
    Telangana: మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు; విద్యార్థులకు బిర్యానీ, కిచిడి  విద్యార్థులు
    'సంపద పెంచుదాం, ప్రజలకు పంచుదాం' ఇదే మా నినాదం: కేసీఆర్  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికల నగారా.. మార్గదర్శకాలు విడుదల చేసిన సీఈసీ అసెంబ్లీ ఎన్నికలు

    వర్షాకాలం

    ఏపీ, తెలంగాణలో ఘనంగా ఏరువాక పౌర్ణమి; వ్యవసాయ పనులు షూరూ  ఆంధ్రప్రదేశ్
    ట్రావెల్: వర్షాకాలంలో అందమైన అనుభూతిని పంచే భారతదేశంలోని పర్యాటక ప్రదేశాలు  పర్యాటకం
    ఊరిస్తున్న నైరుతిరుతుపవనాలు..ఇంకా కేరళను తాకని తొలకరిజల్లులు  నైరుతి రుతుపవనాలు
    నైరుతి రుతుపవనాల జాడేదీ..ఇంకా కేరళను తాకని నైరుతి, మరో 3 రోజుల ఆలస్యం నైరుతి రుతుపవనాలు

    నైరుతి రుతుపవనాలు

    కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు; ధృవీకరించిన ఐఎండీ  తాజా వార్తలు
    తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఇవాళ రేపు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం వర్షాకాలం
    నైరుతి మరింత ఆలస్యం.. వచ్చే 4 వారాల పాటు రుతుపవనాలు లేవు, వర్షాల్లేవ్ కేరళ
    తొలకరి కోసం రైతుల ఎదురుచూపు; మూడు రోజుల తర్వాత వర్షాలపై క్లారిటీ తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025