Page Loader
Andhrapradesh: విశాఖ,తిరుపతిలో త్వరలో పెట్టుబడిదారుల సదస్సుల నిర్వహణకు ఏర్పాట్లు
విశాఖ,తిరుపతిలో త్వరలో పెట్టుబడిదారుల సదస్సుల నిర్వహణకు ఏర్పాట్లు

Andhrapradesh: విశాఖ,తిరుపతిలో త్వరలో పెట్టుబడిదారుల సదస్సుల నిర్వహణకు ఏర్పాట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 08, 2025
11:42 am

ఈ వార్తాకథనం ఏంటి

పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి విశాఖ, తిరుపతిలో త్వరలో పెట్టుబడిదారుల సమావేశాలు నిర్వహించే ఏర్పాట్లు చేయాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అధికారులను ఆదేశించారు. గత నెలలో విజయవాడలో జరిగిన సమావేశంలో పెట్టుబడిదారుల నుండి వచ్చిన ప్రతిపాదనలపై మంగళవారం సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. "రాష్ట్రంలో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి చాలా సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఒబెరాయ్, మేఫేర్, తాజ్, హయత్, మహేంద్ర స్టెర్లింగ్ వంటి సంస్థలు హోటళ్ల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా పెట్టుబడిదారులకు ప్రోత్సాహకమైన పర్యాటక విధానాన్ని రూపొందించాం. ఈ విధానం గురించి రాష్ట్రవ్యాప్తంగా, రాష్ట్రేతర ప్రాంతాల్లో ప్రచారం చేపట్టుతున్నాం" అని మంత్రి తెలిపారు.

వివరాలు 

అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులపై మంత్రి సమీక్ష

"రాష్ట్రంలో 8 బీచ్‌లను సుందరీకరించడం, పరిశుభ్రంగా చేయడం, తాగునీటి సరఫరా, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలను అందించడం వంటి కార్యక్రమాలను ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ పనులు నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించాను. పర్యాటక ప్రాంతాలకు మరింత ప్రచారం కల్పించేందుకు సినీ ప్రముఖుల సహాయం తీసుకోవాలి" అని మంత్రి అన్నారు. అలాగే, సాస్కి పథకంలో భాగంగా చేపట్టాల్సిన అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులపై కూడా మంత్రి సమీక్ష నిర్వహించారు.