NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhrapradesh: విశాఖ,తిరుపతిలో త్వరలో పెట్టుబడిదారుల సదస్సుల నిర్వహణకు ఏర్పాట్లు
    తదుపరి వార్తా కథనం
    Andhrapradesh: విశాఖ,తిరుపతిలో త్వరలో పెట్టుబడిదారుల సదస్సుల నిర్వహణకు ఏర్పాట్లు
    విశాఖ,తిరుపతిలో త్వరలో పెట్టుబడిదారుల సదస్సుల నిర్వహణకు ఏర్పాట్లు

    Andhrapradesh: విశాఖ,తిరుపతిలో త్వరలో పెట్టుబడిదారుల సదస్సుల నిర్వహణకు ఏర్పాట్లు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 08, 2025
    11:42 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి విశాఖ, తిరుపతిలో త్వరలో పెట్టుబడిదారుల సమావేశాలు నిర్వహించే ఏర్పాట్లు చేయాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అధికారులను ఆదేశించారు.

    గత నెలలో విజయవాడలో జరిగిన సమావేశంలో పెట్టుబడిదారుల నుండి వచ్చిన ప్రతిపాదనలపై మంగళవారం సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు.

    "రాష్ట్రంలో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి చాలా సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఒబెరాయ్, మేఫేర్, తాజ్, హయత్, మహేంద్ర స్టెర్లింగ్ వంటి సంస్థలు హోటళ్ల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా పెట్టుబడిదారులకు ప్రోత్సాహకమైన పర్యాటక విధానాన్ని రూపొందించాం. ఈ విధానం గురించి రాష్ట్రవ్యాప్తంగా, రాష్ట్రేతర ప్రాంతాల్లో ప్రచారం చేపట్టుతున్నాం" అని మంత్రి తెలిపారు.

    వివరాలు 

    అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులపై మంత్రి సమీక్ష

    "రాష్ట్రంలో 8 బీచ్‌లను సుందరీకరించడం, పరిశుభ్రంగా చేయడం, తాగునీటి సరఫరా, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలను అందించడం వంటి కార్యక్రమాలను ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ పనులు నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించాను. పర్యాటక ప్రాంతాలకు మరింత ప్రచారం కల్పించేందుకు సినీ ప్రముఖుల సహాయం తీసుకోవాలి" అని మంత్రి అన్నారు.

    అలాగే, సాస్కి పథకంలో భాగంగా చేపట్టాల్సిన అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులపై కూడా మంత్రి సమీక్ష నిర్వహించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    ఆంధ్రప్రదేశ్

    Andhra Pradesh: బలహీనమైన వాయుగుండం.. తీర ప్రాంతాలకు ఉపశమనం బంగాళాఖాతం
    Narayana: ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు : నారాయణ  భారతదేశం
    Free Bus Scheme: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు.. రోజుకు రూ.6కోట్ల వరకు రాబడి కోల్పోనున్న ఆర్టీసీ భారతదేశం
    Andhra Pradesh: గ్రామీణ సంస్థలకు రెండో విడత అన్‌టైడ్ గ్రాంట్‌ను విడుదల చేసిన కేంద్రం  కేంద్ర ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025