LOADING...
Mumbai-Pune Expressway: గ్యాస్‌ ట్యాంకర్‌ బోల్తా..40గంటల తర్వాత ముంబయి-పుణె ఎక్స్‌ప్రెస్‌వే పై ట్రాఫిక్‌ క్లియర్‌..!
40గంటల తర్వాత ముంబయి-పుణె ఎక్స్‌ప్రెస్‌వే పై ట్రాఫిక్‌ క్లియర్‌..!

Mumbai-Pune Expressway: గ్యాస్‌ ట్యాంకర్‌ బోల్తా..40గంటల తర్వాత ముంబయి-పుణె ఎక్స్‌ప్రెస్‌వే పై ట్రాఫిక్‌ క్లియర్‌..!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 05, 2026
08:39 am

ఈ వార్తాకథనం ఏంటి

దాదాపు 40 గంటల పాటు కొనసాగిన తీవ్ర ట్రాఫిక్‌ జామ్‌ అనంతరం ముంబయి-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాల రాకపోకలు నెమ్మదిగా పునఃప్రారంభమయ్యాయి. గ్యాస్‌తో నిండిన ట్యాంకర్‌ బోల్తా పడటంతో ఎక్స్‌ప్రెస్‌వేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ కారణంగా ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు, చిన్నారులు రోడ్డుపైనే గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్యాంకర్‌ను తొలగించేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని గంటల పాటు నిరంతరంగా శ్రమించాయి. ట్యాంకర్‌ నుంచి ప్రమాదకర గ్యాస్‌ లీక్‌ అవుతున్న పరిస్థితుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కఠిన భద్రతా చర్యలు చేపట్టారు. చివరికి ట్యాంకర్‌ను అక్కడి నుంచి సురక్షితంగా తొలగించడంతో ట్రాఫిక్‌ పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గ్యాస్‌ ట్యాంకర్‌ బోల్తా: ఎక్స్‌ప్రెస్‌వేపై గంటల తరబడి వాహనాల నిలుపుదల

Advertisement