Vizianagaram: విజయనగరం జిల్లాలో ట్రావెల్స్ బస్సు దగ్దం.. అందులో 37 మంది ప్రయాణికులు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Mar 21, 2026
09:00 am
ఈ వార్తాకథనం ఏంటి
విజయనగరం జిల్లాలో ఓ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. రామభద్రపురం మండలం తారాపురం సమీపంలో భువనేశ్వర్ నుంచి మల్కాన్గిరి వెళ్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బస్సు వెనుక టైర్ పేలడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సులో ఉన్న ప్రయాణికులందరినీ సురక్షితంగా దించివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 37 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఒడిశాకు చెందిన ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నట్లు సమాచారం.