'తృణమూల్ కాంగ్రెస్' ట్విట్టర్ ఖాతా హ్యాక్; పేరు, లోగో మార్పు
ఈ వార్తాకథనం ఏంటి
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా మంగళవారం హ్యాక్ అయ్యింది. పార్టీ ఖాతా పేరు మార్పు, లోగోను హ్యాకర్లు మార్చారు.
టీఎంసీ ట్విట్టర్ హ్యాండిల్ పేరును 'యుగా ల్యాబ్స్'గా హ్యాకర్లు మార్చారని పార్టీ వర్గాలు తెలిపాయి. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించాయి.
అయితే ఇప్పటివరకు, హ్యాకర్లు ఖాతా నుంచి ఎటువంటి పోస్ట్లను ట్వీట్ చేయలేదు.
ట్విటర్
గతంలో టీడీపీ, వైసీపీ, యూపీ సీఎం ఖాతాలు హ్యాక్
యుగా ల్యాబ్స్ అనేది యూఎస్లో ఉన్న బ్లాక్చెయిన్ టెక్నాలజీ కంపెనీ. ఇది ఎన్ఎఫ్టీ, డిజిటల్ సేకరణలను అభివృద్ధి చేస్తుంది. క్రిప్టోకరెన్సీ, డిజిటల్ మీడియాలో కూడా ఇది చాలా పాపులర్.
గతేడాది డిసెంబర్ 10న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా కూడా హ్యాకింగ్కు గురైంది. ఆ ఖాతాను నుంచి క్రిప్టో-కరెన్సీ గురించి ప్రచారం కూడా చేశారు. అంతకుముందు అక్టోబర్లో తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారు.
ఏప్రిల్ 2022లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్కు పాల్పడ్డారు. హ్యాకర్లు ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ముఖ్యమంత్రి ప్రదర్శన చిత్రాన్ని తొలగించారు. అప్పుడు కూడా, లోగో, ఫొటోను హ్యాకర్లు మార్చారు.