NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Tripura flood: 31కి చేరిన మృతుల సంఖ్య.. నేడు త్రిపురకి కేంద్ర బృందం 
    తదుపరి వార్తా కథనం
    Tripura flood: 31కి చేరిన మృతుల సంఖ్య.. నేడు త్రిపురకి కేంద్ర బృందం 
    31కి చేరిన మృతుల సంఖ్య.. నేడు త్రిపురకి కేంద్ర బృందం

    Tripura flood: 31కి చేరిన మృతుల సంఖ్య.. నేడు త్రిపురకి కేంద్ర బృందం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 28, 2024
    08:33 am

    ఈ వార్తాకథనం ఏంటి

    త్రిపురలో వరదల్లో మరో ఐదుగురు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 31కి చేరుకుందని మంగళవారం ఓ అధికారి తెలిపారు.

    వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి బిసి జోషి నేతృత్వంలోని అంతర్ మంత్రిత్వ శాఖ బృందం బుధవారం రాష్ట్రానికి చేరుకుంటుందని ముఖ్యమంత్రి మాణిక్ సాహా తెలిపారు.

    వరదల్లో ఇళ్లు కొట్టుకుపోవడంతో 492 సహాయ శిబిరాల్లో 72,000 మంది ఇప్పటికీ ఉన్నారని రెవెన్యూ శాఖ కార్యదర్శి బిర్జేష్ పాండే విలేకరుల సమావేశంలో తెలిపారు.

    ఐదు ఎన్‌డిఆర్‌ఎఫ్,ఆరు ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు ఎక్కువగా ఈశాన్య రాష్ట్రంలోని వరద ప్రభావిత జిల్లాలైన గోమతి, దక్షిణ త్రిపుర జిల్లాల్లో సహాయక చర్యలలో నిమగ్నమై ఉన్నాయని ఆయన చెప్పారు.

    వివరాలు 

    సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించిన  ముఖ్యమంత్రి 

    ఆగస్టు 19 నుంచి 23 వరకు సంభవించిన వరదల కారణంగా మొత్తం 31 మంది మరణించగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు.

    వరద పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి మాణిక్ సాహా సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు.

    వరదల కారణంగా జరిగిన విధ్వంసానికి సంబంధించిన వాస్తవ చిత్రాన్ని కేంద్ర బృందం ముందు ప్రదర్శించే ప్రయత్నం జరగాలి. వరదల వల్ల రూ. 15,000 కోట్ల నష్టం వాటిల్లిందని.. అయితే తుది అంచనా తర్వాత అది మరింత పెరగవచ్చని సాహా అన్నారు.

    ఆరోగ్యం, రోడ్లు, తాగునీరు, వ్యవసాయం, ఉద్యానవనం, విద్యుత్, నీటిపారుదల వంటి రంగాలలో నష్టాన్ని ఎత్తిచూపాల్సిన అవసరాన్ని కూడా సాహా నొక్కిచెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    త్రిపుర

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    త్రిపుర

    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా.. తెలంగాణ
    త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ అమిత్ షా
    Election Commission: నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు నేడు షెడ్యూల్‌ విడుదల అసెంబ్లీ ఎన్నికలు
    అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌: త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్‌లో 27న పోలింగ్ అసెంబ్లీ ఎన్నికలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025