Page Loader
Tripura flood: 31కి చేరిన మృతుల సంఖ్య.. నేడు త్రిపురకి కేంద్ర బృందం 
31కి చేరిన మృతుల సంఖ్య.. నేడు త్రిపురకి కేంద్ర బృందం

Tripura flood: 31కి చేరిన మృతుల సంఖ్య.. నేడు త్రిపురకి కేంద్ర బృందం 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 28, 2024
08:33 am

ఈ వార్తాకథనం ఏంటి

త్రిపురలో వరదల్లో మరో ఐదుగురు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 31కి చేరుకుందని మంగళవారం ఓ అధికారి తెలిపారు. వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి బిసి జోషి నేతృత్వంలోని అంతర్ మంత్రిత్వ శాఖ బృందం బుధవారం రాష్ట్రానికి చేరుకుంటుందని ముఖ్యమంత్రి మాణిక్ సాహా తెలిపారు. వరదల్లో ఇళ్లు కొట్టుకుపోవడంతో 492 సహాయ శిబిరాల్లో 72,000 మంది ఇప్పటికీ ఉన్నారని రెవెన్యూ శాఖ కార్యదర్శి బిర్జేష్ పాండే విలేకరుల సమావేశంలో తెలిపారు. ఐదు ఎన్‌డిఆర్‌ఎఫ్,ఆరు ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు ఎక్కువగా ఈశాన్య రాష్ట్రంలోని వరద ప్రభావిత జిల్లాలైన గోమతి, దక్షిణ త్రిపుర జిల్లాల్లో సహాయక చర్యలలో నిమగ్నమై ఉన్నాయని ఆయన చెప్పారు.

వివరాలు 

సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించిన  ముఖ్యమంత్రి 

ఆగస్టు 19 నుంచి 23 వరకు సంభవించిన వరదల కారణంగా మొత్తం 31 మంది మరణించగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. వరద పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి మాణిక్ సాహా సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. వరదల కారణంగా జరిగిన విధ్వంసానికి సంబంధించిన వాస్తవ చిత్రాన్ని కేంద్ర బృందం ముందు ప్రదర్శించే ప్రయత్నం జరగాలి. వరదల వల్ల రూ. 15,000 కోట్ల నష్టం వాటిల్లిందని.. అయితే తుది అంచనా తర్వాత అది మరింత పెరగవచ్చని సాహా అన్నారు. ఆరోగ్యం, రోడ్లు, తాగునీరు, వ్యవసాయం, ఉద్యానవనం, విద్యుత్, నీటిపారుదల వంటి రంగాలలో నష్టాన్ని ఎత్తిచూపాల్సిన అవసరాన్ని కూడా సాహా నొక్కిచెప్పారు.