NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / TSPSC పేపర్ లీక్: పేపర్ అమ్ముకున్న వారు ఎంత మొత్తంలో డబ్బు వసూలు చేసారో వివరించిన సిట్ 
    తదుపరి వార్తా కథనం
    TSPSC పేపర్ లీక్: పేపర్ అమ్ముకున్న వారు ఎంత మొత్తంలో డబ్బు వసూలు చేసారో వివరించిన సిట్ 
    ప్రశ్నాపత్రాలను లీక్ చేసినందుకు భారీగా డబ్బు తీసుకున్న కేటుగాళ్ళు

    TSPSC పేపర్ లీక్: పేపర్ అమ్ముకున్న వారు ఎంత మొత్తంలో డబ్బు వసూలు చేసారో వివరించిన సిట్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 05, 2023
    11:38 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో సంచలనం రేపిన TSPSC పేపర్ లీకు కేసులో నగదు లావాదేవీల గురించి కోర్టుకు సిట్ తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి.

    TSPSC ప్రధాన కార్యదర్శి పీఏ అయిన ప్రవీణ్ కుమార్, ఏఈ సివిల్ ప్రశ్నా పత్రాన్ని 10లక్షల రూపాయలకు అమ్మాడని సిట్ పేర్కొంది.

    గురుకుల పాఠశాల టీచర్ రేణుకా రాథోడ్, ఆమె భర్త డాక్యా నాయక్ లకు 10లక్షల రూపాయలకు ప్రశ్నాపత్రాన్ని అమ్మాడు ప్రవీణ్ కుమార్.

    రేణుకా రాథోడ్, డాక్యా నాయక్ లు, ఆ ప్రశ్నా పత్రాన్ని మరో ఐదుగురికి అమ్మారు. ఆ ఐదుగురిలో ఒక్కొక్కరు కొంత డబ్బు చొప్పున మొత్తం 27.4లక్షలు ఇచ్చారు. ఈ మొత్తంలోంచి 10లక్షలను ప్రవీణ్ కు అందించారు.

    Details

    చేతులు మారిన 33.4లక్షల నగదు 

    అలాగే, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ క్వష్షన్ పేపర్ ను ఖమ్మం జిల్లాకు చెందిన సాయి లౌకిక్, సాయి సుష్మితలకు 6లక్షలకు అమ్మాడు ప్రవీణ్ కుమార్.

    ఈ లెక్కన మొత్తంగా ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో 33.4లక్షల నగదు లవాదేవీలు జరిగినట్లు సిట్ తెలియజేసింది.

    ఇక గ్రూప్ వన్ పేపర్లను కంప్యూటర్ నుండి డౌన్లోడ్ చేసిన రాజశేఖర్ రెడ్డి, వాటిని డబ్బులకు అమ్ముకోలేదనీ, న్యూజిలాండ్ లో నివాసముంటున్న తన బావా సానా ప్రశంత్, TSPSCలో ASO గా పనిచేసిన షమీమ్ కు ఫ్రీగా ఇచ్చాడని సిట్ తెలిపింది.

    అయితే ప్రవీణ్ కుమార్ బ్యాంకు ఖాతాలను సిట్ అధికారులు ఫ్రీజ్ చేసారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    BCCI: ధర్మశాల నుంచి ఢిల్లీకి ఐపీఎల్ జట్లు షిఫ్ట్.. బీసీసీఐ ప్రత్యేక రైలు ఏర్పాటు! బీసీసీఐ
    IPL 2025: భారత్-పాక్ యుద్ధం.. బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ నిరవధికంగా వాయిదా..!   బీసీసీఐ
    Ambala: అంబాలాలో మోగిన యుద్ధ సైరన్లు.. ఇళ్లల్లోకి వెళ్ళిపోమంటూ ఎయిర్ ఫోర్స్ నుంచి హెచ్చరికలు హర్యానా
    IPL 2025: బాంబుల భయం.. స్టేడియం మొత్తం ఖాళీ.. ఛీర్‌లీడర్ వీడియో వైరల్!  ఐపీఎల్

    తెలంగాణ

    'ప్రత్యేక హోదా కోసం పోరాడండి'; ఏపీ మంత్రులకు హరీష్ రావు కౌంటర్  తన్నీరు హరీష్ రావు
    వివేకా హత్యకు కుట్ర పన్నిన విషయం అవినాష్ రెడ్డికి ముందే తెలుసు: సీబీఐ వైఎస్సార్ కడప
    వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట; ఏప్రిల్ 25వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశం  ఆంధ్రప్రదేశ్
    'తెలంగాణ నిర్మాణ పార్టీ' పేరుతో తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025