NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / TSPSC పేపర్ లీక్: పేపర్ అమ్ముకున్న వారు ఎంత మొత్తంలో డబ్బు వసూలు చేసారో వివరించిన సిట్ 
    TSPSC పేపర్ లీక్: పేపర్ అమ్ముకున్న వారు ఎంత మొత్తంలో డబ్బు వసూలు చేసారో వివరించిన సిట్ 
    1/2
    భారతదేశం 1 నిమి చదవండి

    TSPSC పేపర్ లీక్: పేపర్ అమ్ముకున్న వారు ఎంత మొత్తంలో డబ్బు వసూలు చేసారో వివరించిన సిట్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 05, 2023
    11:38 am
    TSPSC పేపర్ లీక్: పేపర్ అమ్ముకున్న వారు ఎంత మొత్తంలో డబ్బు వసూలు చేసారో వివరించిన సిట్ 
    ప్రశ్నాపత్రాలను లీక్ చేసినందుకు భారీగా డబ్బు తీసుకున్న కేటుగాళ్ళు

    తెలంగాణలో సంచలనం రేపిన TSPSC పేపర్ లీకు కేసులో నగదు లావాదేవీల గురించి కోర్టుకు సిట్ తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. TSPSC ప్రధాన కార్యదర్శి పీఏ అయిన ప్రవీణ్ కుమార్, ఏఈ సివిల్ ప్రశ్నా పత్రాన్ని 10లక్షల రూపాయలకు అమ్మాడని సిట్ పేర్కొంది. గురుకుల పాఠశాల టీచర్ రేణుకా రాథోడ్, ఆమె భర్త డాక్యా నాయక్ లకు 10లక్షల రూపాయలకు ప్రశ్నాపత్రాన్ని అమ్మాడు ప్రవీణ్ కుమార్. రేణుకా రాథోడ్, డాక్యా నాయక్ లు, ఆ ప్రశ్నా పత్రాన్ని మరో ఐదుగురికి అమ్మారు. ఆ ఐదుగురిలో ఒక్కొక్కరు కొంత డబ్బు చొప్పున మొత్తం 27.4లక్షలు ఇచ్చారు. ఈ మొత్తంలోంచి 10లక్షలను ప్రవీణ్ కు అందించారు.

    2/2

    చేతులు మారిన 33.4లక్షల నగదు 

    అలాగే, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ క్వష్షన్ పేపర్ ను ఖమ్మం జిల్లాకు చెందిన సాయి లౌకిక్, సాయి సుష్మితలకు 6లక్షలకు అమ్మాడు ప్రవీణ్ కుమార్. ఈ లెక్కన మొత్తంగా ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో 33.4లక్షల నగదు లవాదేవీలు జరిగినట్లు సిట్ తెలియజేసింది. ఇక గ్రూప్ వన్ పేపర్లను కంప్యూటర్ నుండి డౌన్లోడ్ చేసిన రాజశేఖర్ రెడ్డి, వాటిని డబ్బులకు అమ్ముకోలేదనీ, న్యూజిలాండ్ లో నివాసముంటున్న తన బావా సానా ప్రశంత్, TSPSCలో ASO గా పనిచేసిన షమీమ్ కు ఫ్రీగా ఇచ్చాడని సిట్ తెలిపింది. అయితే ప్రవీణ్ కుమార్ బ్యాంకు ఖాతాలను సిట్ అధికారులు ఫ్రీజ్ చేసారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తెలంగాణ

    తెలంగాణ

    దిల్లీలో బీఆర్ఎస్ శాశ్వత భవనాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్  భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    ఏపీ, తెలంగాణలో పదో తరగతి ఫలితాల విడుదల ఎప్పుడంటే? ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ: అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ నెల నుంచే సన్నబియ్యంతో భోజనం  మహిళ
    తెలంగాణ పర్యాటక రంగం కొత్త పుంతలు; బడ్జెట్ హోటళ్ల నిర్మాణం పర్యాటకం
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023