
TTD: వైకుంఠ ద్వార దర్శనాలకు వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచనలు
ఈ వార్తాకథనం ఏంటి
జనవరి 10 నుంచి 19వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది.
పది రోజుల ఈ దర్శనాలకు టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే అనుమతిస్తామని టీటీడీ వెల్లడించింది.
భక్తులు తమకు కేటాయించిన దర్శన తేదీ రోజున మాత్రమే తిరుమల దర్శనానికి రావాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి తెలిపారు .ఈ మేరకు అధికారులతో సమీక్ష నిర్వహించి, పలు సూచనలు చేశారు.
వివరాలు
వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేస్తూ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
9 కేంద్రాల్లో వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. వీటిని సమర్థవంతంగా పంపిణీ చేయాలని, భక్తులు అసౌకర్యానికి గురికావకుండా టీ, పాలు, కాఫీలు అందుబాటులో ఉంచాలని సూచించారు.
ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా, పది రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయడం, చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ, ఎన్ఆర్ఐలు వంటి విశేష దర్శనాలు కూడా రద్దు చేసినట్లు ప్రకటించారు.
గోవింద మాల భక్తులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవని, అలాగే వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
వివరాలు
ప్రతి రోజూ 3.50 లక్షల లడ్డూలు
భక్తులు ఇబ్బందులు ఎదుర్కోకుండా, లడ్డూ విక్రయ కేంద్రంలో ప్రతి రోజూ 3.50 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచాలని సూచించారు.
చలి తీవ్రతకు భక్తులు ఇబ్బంది పడకుండా విశ్రాంతి గృహాల్లో వేడి నీటిని అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
క్యూలైన్ల నిర్వహణ కోసం మూడు వేల మంది యువ శ్రీవారి సేవకులు, స్కౌట్ & గైడ్స్ సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు.