NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / TTD: వైకుంఠ ద్వార దర్శనాలకు వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచనలు 
    తదుపరి వార్తా కథనం
    TTD: వైకుంఠ ద్వార దర్శనాలకు వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచనలు 
    వైకుంఠ ద్వార దర్శనాలకు వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచనలు

    TTD: వైకుంఠ ద్వార దర్శనాలకు వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచనలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 27, 2024
    11:39 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జనవరి 10 నుంచి 19వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది.

    పది రోజుల ఈ దర్శనాలకు టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే అనుమతిస్తామని టీటీడీ వెల్లడించింది.

    భక్తులు తమకు కేటాయించిన దర్శన తేదీ రోజున మాత్రమే తిరుమల దర్శనానికి రావాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి తెలిపారు .ఈ మేరకు అధికారులతో సమీక్ష నిర్వహించి, పలు సూచనలు చేశారు.

    వివరాలు 

    వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు 

    వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేస్తూ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

    9 కేంద్రాల్లో వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. వీటిని సమర్థవంతంగా పంపిణీ చేయాలని, భక్తులు అసౌకర్యానికి గురికావకుండా టీ, పాలు, కాఫీలు అందుబాటులో ఉంచాలని సూచించారు.

    ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా, పది రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయడం, చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ, ఎన్ఆర్ఐలు వంటి విశేష దర్శనాలు కూడా రద్దు చేసినట్లు ప్రకటించారు.

    గోవింద మాల భక్తులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవని, అలాగే వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

    వివరాలు 

    ప్రతి రోజూ 3.50 లక్షల లడ్డూలు 

    భక్తులు ఇబ్బందులు ఎదుర్కోకుండా, లడ్డూ విక్రయ కేంద్రంలో ప్రతి రోజూ 3.50 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచాలని సూచించారు.

    చలి తీవ్రతకు భక్తులు ఇబ్బంది పడకుండా విశ్రాంతి గృహాల్లో వేడి నీటిని అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

    క్యూలైన్ల నిర్వహణ కోసం మూడు వేల మంది యువ శ్రీవారి సేవకులు, స్కౌట్ & గైడ్స్ సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తిరుమల తిరుపతి దేవస్థానం

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    తిరుమల తిరుపతి దేవస్థానం

    నందిని నెయ్యిపై కర్ణాటకలో రాజకీయ దుమారం  కర్ణాటక
    Bhumana Karunakar Reddy: టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించిన భూమన కరుణాకర్‌రెడ్డి భూమన కరుణాకర్‌ రెడ్డి
    Tirumala: తిరుమలలో విషాదం.. చిరుత దాడిలో చిన్నారి మృతి  తిరుమల తిరుపతి
    తిరుమలలో రోహిత్ శర్మ.. కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న భారత కెప్టెన్ ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025