తదుపరి వార్తా కథనం
Montha Cyclone: తీవ్రరూపం దాల్చిన 'మొంథా'.. రాజోలు-అల్లవరం మధ్యం తీరం దాటుతున్న తుపాన్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 28, 2025
07:15 pm
ఈ వార్తాకథనం ఏంటి
తీవ్ర తుపాను 'మొంథా' ఇప్పుడు తీరం సమీపానికి చేరుకుంది. దీని ప్రభావం ఇప్పటికే కోనసీమ జిల్లా వ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, మొంథా తుపాన్ రాజోలు-అల్లవరం మధ్య ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాత్రి 11.30 గంటల తర్వాత తుపాన్ తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. తుపాన్ తీవ్రత దృష్ట్యా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రజల భద్రత కోసం కోనసీమ జిల్లా వ్యాప్తంగా దుకాణాలు మూసివేశారు. తీరప్రాంతాల్లో గాలివానలు, వర్షాలు కొనసాగుతుండగా, పరిస్థితిని జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోంది.