LOADING...
TVK Rally Stampede: విజయ్ ర్యాలీలో 31 మందికి పైగా మృతి.. స్పందించిన సీఎం స్టాలిన్..
విజయ్ ర్యాలీలో 31 మందికి పైగా మృతి.. స్పందించిన సీఎం స్టాలిన్..

TVK Rally Stampede: విజయ్ ర్యాలీలో 31 మందికి పైగా మృతి.. స్పందించిన సీఎం స్టాలిన్..

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 27, 2025
10:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడులోని కరూర్ జిల్లాలో టీవీకే (టీమ్ విజయ్ కజగం) నిర్వహించిన భారీ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. కార్యక్రమానికి అనూహ్యంగా పెద్ద ఎత్తున జనసందోహం రావడంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. ఈ గందరగోళం క్రమంగా తొక్కిసలాట జరిగి పలువురు కార్యకర్తలు స్పృహ కోల్పోయారు. వారిని అత్యవసరంగా అంబులెన్స్‌ల ద్వారా సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ తొక్కిసలాటలో అనేక మంది పిల్లలు కూడా మూర్ఛపోయి గాయపడినట్లు సమాచారం. ఇప్పటివరకు 31మందికి పైగా మరణించినట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. అదనంగా, పదుల సంఖ్యలో కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. ఈ సంఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు.

వివరాలు 

 కనిపించకుండా పోయిన తొమ్మిది ఏళ్ల బాలిక

కరూర్‌లో విజయ్ ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటాన్ని గమనించిన టీవీకే అధినేత విజయ్ తన ప్రసంగాన్ని ఆపి, కార్యకర్తలకు నీటి సీసాలు పంపిణీ చేయించారు. అలాగే, గాయపడిన వారిని తరలించేందుకు అంబులెన్స్‌లకు మార్గం కల్పించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఇంతలో, ర్యాలీకి వచ్చిన తొమ్మిది ఏళ్ల బాలిక ఒకరు కనిపించకుండా పోయింది. ఆమెను గుర్తించేందుకు విజయ్ స్వయంగా తన కార్యకర్తల సహకారం కోరారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు లాఠీచార్జ్ చేసినట్లు సమాచారం. స్పృహ కోల్పోయినవారిని, గల్లంతైన బాలికను రక్షించేందుకు పోలీసులు, ర్యాలీ నిర్వాహకులు వెంటనే చర్యలు చేపట్టారు. ఈ సంఘటనలతో అక్కడి ప్రజల్లో భయాందోళనలు అలుముకున్నాయి.