Page Loader
Road Accident: జమ్ము కశ్మీర్‌' లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు లోయలో పడి ఇద్దరు మృతి.. 42 మందికి గాయాలు
జమ్ము కశ్మీర్‌' లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు లోయలో పడి ఇద్దరు మృతి.. 42 మందికి గాయాలు

Road Accident: జమ్ము కశ్మీర్‌' లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు లోయలో పడి ఇద్దరు మృతి.. 42 మందికి గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
May 06, 2025
03:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా ఘని ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 42 మంది గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం ఉదయం మెంధార్‌లో చోటు చేసుకుంది. ఉదయం 9:20 గంటల సమయంలో ఘని గ్రామం నుంచి మెంధార్ వైపు వెళ్తున్న బస్సు ఓ వంకర వంతెన వద్దకు చేరుకున్నప్పుడు, డ్రైవర్‌కు బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో బస్సు రోడ్డు పక్కన గల లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, సుమారు 42 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

వివరాలు 

తీవ్రంగా గాయపడిన వారిని  వైద్యం కోసం రాజౌరి 

ప్రమాదం సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. గాయపడినవారిని తక్షణమే మెంధార్‌లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అందులో కూడా తీవ్రంగా గాయపడిన కొందరిని మెరుగైన వైద్యం కోసం రాజౌరి తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

Twitter Post