ఆంధ్రప్రదేశ్: హీరో పుట్టినరోజు కోసం ఫ్లెక్సీలు కడుతూ ఇద్దరు అభిమానులు మృతి
అభిమాన హీరోల పుట్టినరోజు నాడు ఫ్లెక్సీలు కట్టే సాంప్రదాయం గత కొన్నేళ్ళుగా బాగా పుంజుకుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో హీరో సూర్య పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాక్ తగిలి ఇద్దరు అభిమానులు మరణించారు. ఈ సంఘటన పల్నాడు జిల్లాలో జరిగింది. నరసరావు పేట మండలం మోపువారిపాలెం అనే గ్రామానికి చెందిన ఇంటర్ చదివే విద్యార్థులు నక్కా వెంకటేష్, పోలూరు సాయి.. హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా ఊరంతా ఫ్లెక్సీలు కడదామని నిర్ణయించుకున్నారు. అయితే ఒకానొక ప్రదేశంలో ఫ్లెక్సీ కడుతుండగతా కరెంట్ షాక్ తగిలింది. దాంతో వారిద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.