Page Loader
Army jawans: జమ్ము కశ్మీర్‌లో ఇద్దరు జవాన్లు కిడ్నాప్.. ఒకరు మృతి 
జమ్ము కశ్మీర్‌లో ఇద్దరు జవాన్లు కిడ్నాప్.. ఒకరు మృతి

Army jawans: జమ్ము కశ్మీర్‌లో ఇద్దరు జవాన్లు కిడ్నాప్.. ఒకరు మృతి 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 09, 2024
02:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌ అనంత్‌నాగ్‌ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇందులో ఇద్దరు ఆర్మీ జవాన్లను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. కాకర్‌నాగ్‌ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న 161 యూనిట్‌కు చెందిన ఈ జవాన్లను టెరిటోరియల్ ఆర్మీ సిబ్బంది కిడ్నాప్ చేయడం తెలిసిందే. ఈ ఘటనలో, ఒక జవాన్ ఉగ్రవాదుల చెర నుంచి తప్పించుకున్నాడు. అయితే అతనికి రెండు బుల్లెట్ గాయాలయ్యాయి. వెంటనే అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి నిలకడగా ఉందని ఆర్మీ అధికారి తెలిపారు. .

Details

మృతి చెందిన జవాన్ శరీరంపై బుల్లెట్ గాయాలు

ఇక మరో జవాను కోసం ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. కానీ శవమై గుర్తించినట్లు సమాచారం మృతి చెందిన జవాన్‌ శరీరంపై బుల్లెట్‌ గాయాలున్నట్లు గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. సాధారణంగా ఈ చర్యలు జమ్ము కశ్మీర్‌లో భద్రతా పరిస్థితులను మరింత క్షీణించడానికి దారితీస్తున్నాయి. స్థానిక ప్రజలలో ఉత్పత్తి అయ్యే భయం మరింత పెరిగింది.