ఇద్దరు మహిళల ఊపిరి నిలబెట్టిన రెస్క్యూ టీం
జమ్మూ కాశ్మీర్లోని బందిపోరా జిల్లాలోని గురెజ్ సరిహద్దు ప్రాంతంలో హిమపాతం కారణంగా ఇద్దరు మహిళలు ప్రమాదంలో పడ్డారు. ఈ ఉదయం గురేజ్ తహసీల్లోని తులైల్ ప్రాంతంలోని మజ్గుండ్ గ్రామంలో తబస్సుమ్, షాజాదా అనే ఇద్దరు హిమపాతంలో చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే రెస్య్కూ టీం అపరేషన్ ప్రారంభించి ఇద్దరు మహిళలను సురక్షితంగా కాపాడారు. హిమపాతం కారణంగా ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని అధికారులు ధ్రువీకరించారు.
ఎత్తైన ప్రాంతాలలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
J& K ఎత్తైన ప్రాంతాలలో నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, హిమపాతం కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఖచ్చితంగా అవసరమైతే తప్ప అటువంటి ప్రాంతాలకు వెళ్లకూడదని అధికారులు సూచించారు. ఎవరైనా ప్రమాదంలో చిక్కుకున్నట్లు గుర్తిస్తే వెంటనే రెస్య్కూ టీంకి సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.