Page Loader
Om Birla: భారతదేశం ప్రజాస్వామ్య విలువలు, వృద్ధిని యూకే బలంగా విశ్వసిస్తోంది: ఓం బిర్లా 
భారతదేశం ప్రజాస్వామ్య విలువలు, వృద్ధిని యూకే బలంగా విశ్వసిస్తోంది: ఓం బిర్లా

Om Birla: భారతదేశం ప్రజాస్వామ్య విలువలు, వృద్ధిని యూకే బలంగా విశ్వసిస్తోంది: ఓం బిర్లా 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 09, 2025
08:33 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశ ప్రజాస్వామ్య విలువలను, వృద్ధిని యూకే గట్టి నమ్మకంతో విశ్వసిస్తోందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. యూకే పర్యటనలో భాగంగా లండన్‌లోని భారత హైకమిషన్‌లో జరిగిన సమావేశంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. 'ప్రముఖ యూకే పార్లమెంటేరియన్లతో చర్చలు జరిపాను. భారత ప్రజాస్వామ్య విలువలు, వృద్ధిపై వారికున్న గట్టి నమ్మకం గురించి తెలుసుకున్నాను. ఇటీవల భారత్‌లో జరిగిన ఎన్నికల ప్రక్రియ పూర్తి పారదర్శకతతో జరిగింది. ఈ ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని పెంచడానికి సహాయపడింది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్‌ను ప్రజాస్వామ్య మాతృమూర్తిగా గర్వంగా అభివర్ణిస్తున్నారు.

వివరాలు 

యూకే హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ లిండ్సే హోయ్‌లతో ఓం బిర్లా సమావేశం 

భవిష్యత్తులో అభివృద్ధి పరంగా భారత్ ఇతర దేశాలను అధిగమించగల సామర్థ్యం కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నివసిస్తున్న భారతీయులు వికసిత్‌ భారత్‌ లక్ష్య సాధనలో కీలకంగా సహకరిస్తున్నారు. ప్రధాని మోదీ ప్రతిపాదించిన ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రవాస భారతీయులు చేస్తున్న కృషి కీలక పాత్ర పోషిస్తోంది. యూకే-భారత ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపర్చాలి' అని ఆయన పేర్కొన్నారు. 17 సంవత్సరాల తరువాత లోక్‌సభ స్పీకర్ యూకేలో పర్యటించడం ఇదే తొలిసారి.. పర్యటనలో భాగంగా యూకే హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ లిండ్సే హోయ్‌లతో సమావేశమై వివిధ అంశాలపై చర్చలు జరిపారు.