NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / One Nation, One Election Bill: వన్ నేషన్, వన్ ఎలక్షన్, సమగ్ర బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం 
    తదుపరి వార్తా కథనం
    One Nation, One Election Bill: వన్ నేషన్, వన్ ఎలక్షన్, సమగ్ర బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం 
    వన్ నేషన్, వన్ ఎలక్షన్, సమగ్ర బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

    One Nation, One Election Bill: వన్ నేషన్, వన్ ఎలక్షన్, సమగ్ర బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 12, 2024
    02:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలో ఒకే సమయంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర కేబినెట్ 'జమిలి బిల్లు'కు ఆమోదం తెలిపింది.

    దీంతో.. సమగ్ర బిల్లు పార్లమెంట్‌ ముందుకు చర్చకు రానుంది

    దేశంలో వేరే వేరుగా ఎన్నికలు నిర్వహించడం ప్రగతికి ఆటంకం అవుతుందని కేంద్రంలోని బీజేపీ ప్రారంభం నుండి పేర్కొంటున్నది.

    ఈ పద్దతిని గురువారం నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదించారు.

    గతంలో కోవింద్ కమిటీ సిఫారసులకు కూడా కేబినెట్ ఆమోదం ఇచ్చింది.

    కోవింద్ నేతృత్వంలో ఏర్పడిన అత్యున్నత స్థాయి కమిటీ 18,626 పేజీల నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది.

    వివరాలు 

    ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం దేశ ప్రజల ఆకాంక్షలను మరింత బలపరచడంలో సహాయపడుతుంది 

    ఈ నివేదిక రూపకల్పనను 2023 సెప్టెంబర్ 2న ప్రారంభించారు. నిపుణుల ఆధ్వర్యంలో 191 రోజుల కసరత్తు తర్వాత ఈ నివేదిక పూర్తైంది.

    కోవింద్ కమిటీ మొదటి దశలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని, రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలను 100 రోజుల్లో నిర్వహించాలని సిఫారసు చేసింది.

    కోవింద్ కమిటీ నివేదికలో, ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం దేశ ప్రజల ఆకాంక్షలను మరింత బలపరచడంలో సహాయపడుతుందని పేర్కొంది.

    ఒకే సమయంలో ఎన్నికలు జరిపించడం అభివృద్ధి ప్రదేశాన్ని, సామాజిక ఐక్యతను పెంచి, ప్రజాస్వామ్య పునాదిని మరింత బలోపేతం చేస్తుందని తెలిపింది.

    కోవింద్ కమిటీ ఈ విధంగా ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించడం పారదర్శకత, సౌలభ్యం, ఓటరు విశ్వాసాన్ని పెంచుతుందని అభిప్రాయపడింది.

    వివరాలు 

    అన్ని రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం, వచ్చే లోక్‌సభ ఎన్నికల వరకు కొనసాగాలి 

    ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన పరికరాలు, సిబ్బంది, భద్రతా దళాల ముందస్తు ప్రణాళికలను ఈ కమిటీ సూచించింది.

    ఈ నివేదికలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం, వచ్చే లోక్‌సభ ఎన్నికల వరకు కొనసాగాలని పేర్కొంది.

    హంగ్ హౌస్ లేదా అవిశ్వాస తీర్మానం జరిగితే, మిగిలిన ఐదేళ్ల కాలానికి తాజా ఎన్నికలు నిర్వహించవచ్చని కూడా కోవింద్ కమిటీ సూచించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమిలి ఎన్నికలు

    తాజా

    Vishaka Metro: అక్టోబర్‌లో విశాఖ మెట్రో పనుల ప్రారంభానికి సిద్ధం: మంత్రి నారాయణ  విశాఖపట్టణం
    Motivation: అవమానాలు తాత్కాలికం.. మీ విలువే శాశ్వతం! జీవితం
    MI vs DC: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ముంబై.. ఇంటిబాట పట్టిన ఢిల్లీ ముంబయి ఇండియన్స్
    Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం పాకిస్థాన్

    జమిలి ఎన్నికలు

    One nation, one election: జమిలి ఎన్నికల కోసం 8మందితో కేంద్రం కమిటీ.. గెజిట్ నోటిఫికేషన్ జారీ  అసెంబ్లీ ఎన్నికలు
    Adhir Ranjan Chowdhury: జమిలి ఎన్నికల కమిటీలో ఉండలేను: అమిత్ షాకు కాంగ్రెస్ ఎంపీ అధీర్ చౌదరి లేఖ  రామ్‌నాథ్‌ కోవింద్‌
    One Nation, One Election: జమిలి ఎన్నికల ఆలోచనపై రాహుల్ గాంధీ ఫైర్  రాహుల్ గాంధీ
    ముందస్తు ఎన్నికలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025