NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Amit Shah: పాకిస్థాన్ పౌరులను తక్షణమే వెనక్కి పంపించండి.. సీఎంలకు అమిత్‌ షా దిశానిర్దేశం
    తదుపరి వార్తా కథనం
    Amit Shah: పాకిస్థాన్ పౌరులను తక్షణమే వెనక్కి పంపించండి.. సీఎంలకు అమిత్‌ షా దిశానిర్దేశం
    పాకిస్థాన్ పౌరులను తక్షణమే వెనక్కి పంపించండి.. సీఎంలకు అమిత్‌ షా దిశానిర్దేశం

    Amit Shah: పాకిస్థాన్ పౌరులను తక్షణమే వెనక్కి పంపించండి.. సీఎంలకు అమిత్‌ షా దిశానిర్దేశం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 25, 2025
    02:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్‌కు చెందిన పౌరుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించేందుకు ముందడుగు వేసింది.

    శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్‌ ద్వారా మాట్లాడి,తమ తమ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థాన్ పౌరులను గుర్తించి వెంటనే వెనక్కి పంపించాలని ఆదేశించినట్లు సమాచారం.

    ఇటీవల పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం పాకిస్థానీయులకు జారీ చేసిన వీసాలను రద్దు చేసిన విషయం తెలిసిందే.

    వారంలోపే భారతదేశాన్ని విడిచిపోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.ఈ పరిణామాల మధ్యే తాజాగా రాష్ట్రాలను మరింత జాగ్రత్తగా ఉండాలని కేంద్ర హోం శాఖ సూచించింది.

    ఇదిలా ఉండగా,పలురాష్ట్రాల్లోని పోలీస్ శాఖలు తమ పరిధిలో ఉన్న పాక్ పౌరులపై నిఘా పెంచాయి.

    వివరాలు 

    హైదరాబాద్ లో  208 మంది పాకిస్థానీయులు 

    పాకిస్థాన్ పౌరుల సమాచారం సేకరించడంలో పోలీసులు కృషి చేస్తున్నారు.

    హైదరాబాద్‌లోని స్పెషల్ బ్రాంచ్ వద్ద నమోదైన సమాచారం ప్రకారం, మొత్తం 208 మంది పాకిస్థానీయులు నగరంలో ఉన్నట్లు గుర్తించారు.

    వీరిలో 156 మందికి లాంగ్ టర్మ్ వీసాలు ఉండగా, 13 మందికి షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నట్లు తెలిసింది.

    ఈ విదేశీయులను రెండు రోజుల్లో భారతదేశం విడిచి వెళ్ళాలని పోలీసులు సూచించినట్లు సమాచారం.

    నల్ల రిబ్బన్‌లతో మసీదులలో నమాజ్‌

    పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ,మృతుల కుటుంబాలకు సంఘీభావం ప్రకటించేందుకు ముస్లింలు మక్కా మసీదులో నల్ల రిబ్బన్‌లు ధరించి నమాజ్‌లో పాల్గొన్నారు.

    మరోవైపు, శాస్త్రిపుర ప్రాంతంలోని ఒక మసీదులో ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ నమాజ్‌కు వచ్చినవారికి నల్లటి రిబ్బన్‌లు పంపిణీ చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమిత్ షా

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    అమిత్ షా

    Amit Shah: మావోయిస్టుల నిర్మూలనకు కృషి.. సరికొత్త వ్యూహాలను రచిస్తోన్న కేంద్రం కేంద్ర ప్రభుత్వం
    Amit Shah: మావోయిస్టు విపత్తును అధిగమించడంలో ఛత్తీస్‌గఢ్‌ ఆదర్శం.. అమిత్ షా  దిల్లీ
    Ratan Tata: ప్రభుత్వ లాంఛనాలతో రతన్‌ టాటా అంత్యక్రియలు.. కేంద్రం తరఫున అమిత్‌ షా రతన్ టాటా
    Nara Lokesh: అమిత్‌ షాతో మంత్రి లోకేశ్‌ భేటీ.. రాష్ట్ర అభివృద్ధిపై కీలక చర్చలు నారా లోకేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025