NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhrapradesh: రాజధాని అమరావతిని కలుపుకొంటూ జాతీయ రహదారి: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌
    తదుపరి వార్తా కథనం
    Andhrapradesh: రాజధాని అమరావతిని కలుపుకొంటూ జాతీయ రహదారి: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌
    రాజధాని అమరావతిని కలుపుకొంటూ జాతీయ రహదారి

    Andhrapradesh: రాజధాని అమరావతిని కలుపుకొంటూ జాతీయ రహదారి: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 04, 2024
    10:09 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజధాని అమరావతిని కలుపుతూ జాతీయ రహదారి విస్తరణకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) రూపొందించిన ప్రణాళిక రవాణా సేవలను మెరుగుపరుస్తుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు .

    గురువారం గుంటూరు కలెక్టరేట్‌లో జాతీయ రహదారుల పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి, కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపే హైవే-16 అభివృద్ధి ప్రణాళికను ప్రశంసించారు.

    'వినుకొండ-గుంటూరు మార్గం రెండు లైన్ల నుంచి నాలుగు లైన్లుగా విస్తరించబడుతుందని,మరో 25 కిలోమీటర్ల మేర పొడిగించి అమరావతిని తాకేలా ప్రణాళిక రూపొందించబడింది' అని మంత్రి పేర్కొన్నారు.

    ఈ హైవే రాజధాని అభివృద్ధికి కీలకంగా మారుతుందని, గుంటూరుకు మరో ఔటర్‌ రింగ్‌ రోడ్డు లా ఉపయోగపడుతుందని వివరించారు.

    వివరాలు 

    రైతులను మోసగించిన వారిపై చర్యలు

    ఎన్‌హెచ్‌ఏఐ ఈ నిర్మాణాన్ని చేపట్టగా, రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ, విద్యుత్ వంటి పనులను వేగవంతంగా చేపట్టాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

    రెండు సంవత్సరాల్లో ఈ నిర్మాణం పూర్తవుతుందని అంచనా వేశారు. ఈ సమీక్ష సమావేశంలో కలెక్టర్ ఎస్‌.నాగలక్ష్మి, ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు పాల్గొన్నారు.

    రైతుల మోసాల విషయంలో,గుంటూరు,పల్నాడు,ప్రకాశం,కర్నూలు జిల్లాల రైతులు శీతల గిడ్డంగుల్లో మిర్చి నిల్వచేస్తే,వారి తెలియకుండానే రుణాలు తీసుకుని మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి చంద్రశేఖర్‌ హెచ్చరించారు.

    మోసపోయిన రైతుల కన్నీటి దృశ్యాలు బాధ కలిగించాయని,నిందితులను అరెస్టు చేసి,వారి ఆస్తులను అటాచ్‌ చేయడానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

    నకిలీ రైతులపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమరావతి

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    అమరావతి

    అమరావతి రాజధానికే మద్దతు ఇచ్చిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే మైలవరం
    అమరావతిపై విచారణను జులై 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్‌‌లో చల్లచల్లగా; రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు  ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట; చంద్రబాబు పాలనలో నిర్ణయాలపై విచారణకు లైన్ క్లియర్  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025