NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pemmasani Chandrasekhar: గుంటూరులో శంకర్ విలాస్ బ్రిడ్జి స్థానంలో కొత్తగా ఆర్‌వోబీ నిర్మాణం..!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Pemmasani Chandrasekhar: గుంటూరులో శంకర్ విలాస్ బ్రిడ్జి స్థానంలో కొత్తగా ఆర్‌వోబీ నిర్మాణం..!
    గుంటూరులో శంకర్ విలాస్ బ్రిడ్జి స్థానంలో కొత్తగా ఆర్‌వోబీ నిర్మాణం..!

    Pemmasani Chandrasekhar: గుంటూరులో శంకర్ విలాస్ బ్రిడ్జి స్థానంలో కొత్తగా ఆర్‌వోబీ నిర్మాణం..!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 21, 2025
    01:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గుంటూరులో శంకర్ విలాస్ బ్రిడ్జి స్థానంలో కొత్తగా ఆర్‌వోబీ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేస్తామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.

    ఈ సమయంలో, ఆర్‌వోబీ నిర్మాణంతో భూములు కోల్పోయే 21 మంది రైతులకు 70 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు.

    ఈ ప్రక్రియపై ప్రజల్లో సందేహాలు నెలకొనే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

    పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పినట్లుగా, మొదట ఆర్‌యూబీ నిర్మాణం చేయడం, తర్వాత ఆర్‌వోబీ నిర్మాణం చేయడం సాంకేతికంగా సాధ్యం కాదని పేర్కొన్నారు.

    అండర్ పాసులు, సర్వీస్ రోడ్లు కలిసేలా నిర్మాణం చేపట్టాలని స్పష్టం చేశారు.

    వివరాలు 

    అండర్ పాసులు కూడా..

    "శంకర్ విలాస్ బ్రిడ్జి దాదాపు ఆరు దశాబ్దాల క్రితం నిర్మించారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, కేంద్రంతో మాట్లాడి ఫ్లై ఓవర్ నిర్మాణానికి కావాల్సిన అనుమతులు, నిధులు త్వరగా పొందామన్నారు. ఎమ్మెల్యేలు, అధికారులు, అన్ని వర్గాల సహకారంతో టెండర్ల ప్రక్రియను పూర్తిచేసాం." అని చెప్పారు.

    ఇది జరిగేపని కాదన్నారు.. మొదట్లో నన్ను నాలుగైదుసార్లు కలిస్తే వారిచ్చిన సలహాలన్నీ తీసుకున్నాం.

    అండర్ పాసులు కూడా ఉండనున్నాయి. భవిష్యత్తులో ఆర్.యూ.బీ. నిర్మాణం కూడా ఆలోచించవచ్చు.

    అయితే, ఇప్పుడు ప్రస్తుత ఆర్.ఓ.బీ. నిర్మాణంతో కొంతమంది భూములు కోల్పోతున్నారు." అని వివరించారు.

    వివరాలు 

    ఆ పనులకు అడ్డుపడకూడదు

    సర్వీస్ రోడ్లు గురించి పేర్కొంటూ, "ప్రస్తుత ప్రాజెక్టు 27 అడుగుల సర్వీస్ రోడ్డు ఉంటుంది. ఇది మా బాధ్యతగా తీసుకుని, తప్పులు జరగకుండా చూసుకుంటున్నాం." అని చెప్పారు.

    "ఈ ఆర్.ఓ.బీ. నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేస్తాం. ఎవరూ ఆ పనులకు అడ్డుపడకూడదు" అని విజ్ఞప్తి చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గుంటూరు తూర్పు

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    గుంటూరు తూర్పు

    Andhra Pradesh: చివరిదశకు గుంటూరు-గుంతకల్లు రైలు మార్గం డబ్లింగ్‌ పనులు గుంతకల్లు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025