Loading...
UN reacts to protests in Delhi: నీట్ విద్యార్థుల నిరసనలపై ఐక్యరాజ్యసమితి కీలక వ్యాఖ్యలు
నీట్ విద్యార్థుల నిరసనలపై ఐక్యరాజ్యసమితి కీలక వ్యాఖ్యలు

UN reacts to protests in Delhi: నీట్ విద్యార్థుల నిరసనలపై ఐక్యరాజ్యసమితి కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 25, 2026
02:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా నీట్-యూజీ (NEET-UG) పరీక్షలో అక్రమాల ఆరోపణలపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి (UN) స్పందించింది. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయాలనుకునే ప్రజలకు అవకాశం కల్పించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమని యూఎన్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. యూఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, శాంతియుత నిరసనలు ప్రజాస్వామ్య హక్కులో భాగమని పేర్కొన్నారు. అలాంటి నిరసనలకు ప్రభుత్వాలు తగిన అవకాశాన్ని కల్పించాలని, అదే సమయంలో చట్టాన్ని అమలు చేసే సంస్థలు అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. ఇటీవల ఢిల్లీలో పార్లమెంట్ వైపు విద్యార్థులు చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే.

వివరాలు

దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ

పోలీసులు లాఠీచార్జ్, బాష్పవాయువు ప్రయోగించగా పలువురు విద్యార్థులు, పోలీసు సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.

నీట్ పరీక్షలో ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలు, పరీక్షల నిర్వహణలో పారదర్శకత లేకపోవడంపై విద్యార్థులు కేంద్ర ప్రభుత్వంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు పరీక్షల వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఉద్యమానికి పలు ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, సామాజిక సంస్థలు కూడా మద్దతు ప్రకటించాయి. ఈ పరిణామాల మధ్య యూఎన్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

శాంతియుతంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కును గౌరవించడం ప్రతి ప్రజాస్వామ్య దేశం బాధ్యత అని యూఎన్ పునరుద్ఘాటించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరలవుతున్న వీడియో

ADVERTISEMENT