NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / సీమాహైదర్ లవ్ స్టోరీలో ఇండియన్ పోలీసులకు బెదిరింపులు.. రంగంలోకి ముంబై పోలీస్
    తదుపరి వార్తా కథనం
    సీమాహైదర్ లవ్ స్టోరీలో ఇండియన్ పోలీసులకు బెదిరింపులు.. రంగంలోకి ముంబై పోలీస్
    సీమాహైదర్ ప్రేమ కథలో ముంబయి పోలీసులకు మరో హెచ్చరిక

    సీమాహైదర్ లవ్ స్టోరీలో ఇండియన్ పోలీసులకు బెదిరింపులు.. రంగంలోకి ముంబై పోలీస్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 14, 2023
    12:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థానీ మహిళ సీమా హైదర్, సచిన్ మీనాల ప్రేమ కథలో ఇండియన్ పోలీసులకు బెదిరింపులు వస్తున్నాయి. ప్రియుడితో కలిసి ఉండాలని పాక్ దేశాన్ని విడిచిపెట్టింది సీమా హైదర్. ఈ మేరకు ప్రేమికుడు ఉండే భారతదేశానికి తరలివచ్చింది.

    ముంబై పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తి వార్నింగ్ ఇచ్చాడు. తమ దేశానికి చెందిన సీమా హైదర్ పాకిస్థాన్ కు వెనక్కి తిరిగి రాకుంటే ముంబై 26/11 తరహా ఉగ్రదాడులకు పాల్పడతామని హెచ్చరించారు.

    ఈ క్రమంలోనే ట్రాఫిక్ కంట్రోల్ రూంకు ఫోన్ కాల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. సీమా తిరిగి పాక్ కు రాకపోతే భారతదేశంలో విధ్వంసం సృష్టిస్తామని సదరు కాలర్ హెచ్చరించాడు.

    details

    ముంబై 26/11 తరహాలో మరో ఘటనకు రెఢీగా ఉండాలంటూ బెదిరింపు కాల్స్

    ఈ మేరకు భారతదేశంలోని ప్రతి ఒక్కరూ మరో 26/11 ముంబై ఉగ్రదాడి ఘటనకు సిద్ధంగా ఉండాలని బెదిరిస్తున్నాడు.

    భవిష్యత్ లో ఏం జరిగినా ఆయా ఘటనలకు సంబంధించి ఉత్తర్‌ప్రదేశ్ సర్కార్ బాధ్యత వహించాలని కాలర్ డిమాండ్ చేస్తున్నాడు.

    ఈ క్రమంలో సదరు ఫోన్ కాల్ ను సీరియస్ గా తీసుకున్న ముంబయి పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులతో కలిసి ముమ్మర విచారణ చేస్తున్నారు.

    ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఇలాంటి బెదిరింపు కాల్స్ తరచూగా వస్తుంటాయి. కానీ సీమా విషయాన్ని మాత్రం సిటీ పోలీసులు నిశితంగా గమనిస్తున్నారు.

    ఎట్టిపరిస్థితుల్లోనూ పోన్ చేసిన నిందితుడ్ని పట్టుకోవాలని ప్రయత్నాలు సాగిస్తున్నారు.

    details

    భర్తను వదిలేసి ప్రియుడ్నే భర్తగా చేసుకున్న సీమా హైదర్

    అసలేం జరిగిందంటే :

    పాకిస్థాన్ లోని సింధ్ ప్రావిన్సుకు చెందిన సీమా హైదర్ 2014లో ఓ పాకిస్థానీని వివాహం చేసుకుంది. అనంతరం అతడితో కలిసి కరాచీలో నివాసం ఉండేది.ఈ క్రమంలో ఆమెకు పబ్ జీ గేమ్ ఆడటం అలవాటైంది.

    సదరు ఆన్లైన్ గేమ్ ద్వారా భారత యువకుడు సచిన్ మీనాతో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది.

    ఈ నేపథ్యంలోనే సీమా భర్తను వదిలేసి తన నలుగురు పిల్లల్ని తీసుకుని నేపాల్ మీదుగా ఇండియాకు వచ్చేసింది. అనంతరం తన ప్రేమికుడు సచిన్ ను పెళ్లాడిన సీమా హైదర్ వార్తల్లో నిలిచారు.

    మరోవైపు తన భార్య, పిల్లలను పాక్ పంపించాలని సీమా హైదర్ భర్త గులాం హైదర్ కేంద్రాన్ని కోరుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్
    భారతదేశం
    ముంబై

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    పాకిస్థాన్

    ఇమ్రాన్ ఖాన్‌కు సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించినా, రాజకీయ భవిష్యత్‌పై నీలినీడలు  సుప్రీంకోర్టు
    ఆసియా కప్ ను బహిష్కరిస్తాం.. ఏసీసీకి పాక్ బోర్డు బెదిరింపులు టీమిండియా
    పాకిస్థాన్‌లో ఆడితే ఓడిపోతామన్న భయం ఇండియాకు ఉంది : పీసీబీ ఛీఫ్  టీమిండియా
    నన్ను పదేళ్లపాటు జైలులో పెట్టేందుకు ఆర్మీ కుట్ర: ఇమ్రాన్‌ ఖాన్‌ సంచలన ఆరోపణలు  తాజా వార్తలు

    భారతదేశం

    భారత్ రక్షణకు అమెరికా కీలక సహకారం.. స్ట్రైకర్ ఆర్మర్డ్ వాహనాలకు గ్రీన్ సిగ్నల్ అమెరికా
    2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీని 6.3శాతానికి పెంచిన ఫిచ్  వృద్ధి రేటు
    ఇక భారత్‌లోనే యుద్ధవిమానాల ఇంజిన్‌ల తయారీ; GE ఏరోస్పేస్- HAL మధ్య ఒప్పందం యుద్ధ విమానాలు
    భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం; 2024‌లో ఐఎస్ఎస్‌కి జాయింట్ ఆస్ట్రోనాట్ మిషన్‌  ఇస్రో

    ముంబై

    E3W ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసిన మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ మహీంద్రా
    ముంబయి: 100ఏళ్ల నాటి 'గేట్‌వే ఆఫ్ ఇండియా'కు పగుళ్లు- పెచ్చులూడుతున్న స్మారక చిహ్నం మహారాష్ట్ర
    ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు గురించి రైల్వే మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ట్విట్టర్
    ప్లాస్టిక్ సంచిలో కుళ్లిపోయిన మహిళ మృతదేహం; కుమార్తెపైనే అనుమానాలు మహారాష్ట్ర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025