
Falaknuma: పాతబస్తీలో కలకలం.. నడిరోడ్డుపై రౌడీషీటర్ దారుణ హత్య
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగరంలోని ఫలక్నుమా ప్రాంతంలో ఓ దారుణ హత్య చోటుచేసుకుంది.
రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్ మాస్ యుద్దీన్ను గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి విచక్షణ రహితంగా నరికి హతమార్చారు.
ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది.
మూడురోజుల క్రితమే వివాహితుడైన యుద్దీన్, కొత్త జీవితాన్ని ప్రారంభించిన క్రమంలోనే ఈ అకాల మరణం అతని కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది.
గుర్తుతెలియని దుండగులు ముందుగానే పక్కా పథకం ప్రకారం యుద్దీన్ను లక్ష్యంగా చేసుకుని కత్తులతో దాడికి పాల్పడ్డట్లు పోలీసులు భావిస్తున్నారు.
Details
దర్యాప్తు చేస్తున్న పోలీసులు
తీవ్రంగా గాయపడిన అతను ఘటనాస్థలంలోనే రక్తపు మడుగులో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించడంతో పాటు, సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తూ నిందితుల గుర్తింపు కోసం చర్యలు తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఈ హత్య ఘటనతో ఫలక్నుమాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.