LOADING...
US: భారత్‌ రక్షణ బలానికి అమెరికా కీలక మద్దతు.. 428 మిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీకి ఆమోదం
428 మిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీకి ఆమోదం

US: భారత్‌ రక్షణ బలానికి అమెరికా కీలక మద్దతు.. 428 మిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీకి ఆమోదం

వ్రాసిన వారు Sirish Praharaju
May 19, 2026
10:14 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌-అమెరికా రక్షణ సంబంధాలు మరింత దృఢంగా మారుతున్నాయి. భారత సైనిక శక్తిని పెంచే దిశగా అమెరికా మరో ముఖ్య నిర్ణయం తీసుకుంది. అపాచీ యుద్ధ హెలికాప్టర్లు,ఎం777 హోవిట్జర్ల నిర్వహణ,సాంకేతిక సహకారం కోసం మొత్తం 428.2 మిలియన్ డాలర్ల విలువైన రెండు రక్షణ ఒప్పందాలకు అమెరికా విదేశాంగ శాఖ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని అమెరికా కాంగ్రెస్‌కు మే 18న ప్రత్యేక నోటిఫికేషన్ల ద్వారా తెలియజేసింది. ఈ ఒప్పందాల్లో తొలి ఒప్పందం ఎం777ఏ2 అల్ట్రా లైట్ హోవిట్జర్ల దీర్ఘకాల నిర్వహణకు సంబంధించినది. దాని విలువ 230మిలియన్ డాలర్లు. ఇందులో విడిభాగాల సరఫరా,మరమ్మతు సేవలు, సాంకేతిక సహాయం, సిబ్బందికి శిక్షణ, ఫీల్డ్ సేవలు వంటి అంశాలు ఉన్నాయి. ఈ పనులను బీఏఈ సిస్టమ్స్ సంస్థ నిర్వహించనుంది.

వివరాలు 

ప్రధాన బాధ్యతలు చేపట్టనున్న బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్ సంస్థలు

రెండో ఒప్పందం ఏహెచ్-64ఈ అపాచీ హెలికాప్టర్ల నిర్వహణ, సాంకేతిక మద్దతుకు సంబంధించినది. దీని విలువ 198.2 మిలియన్ డాలర్లు. ఈ ఒప్పందం కింద ఇంజినీరింగ్ సేవలు, లాజిస్టిక్స్ సహాయం, సాంకేతిక మద్దతు, సిబ్బందికి శిక్షణ వంటి సేవలు అందించనున్నారు. బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్ సంస్థలు ప్రధాన బాధ్యతలు చేపట్టనున్నాయి. ఈ రెండు ఒప్పందాలు ఇండో-పసిఫిక్, దక్షిణాసియా ప్రాంతాల్లో శాంతి, రాజకీయ స్థిరత్వం, ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది.

వివరాలు 

భారత్‌ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం

భారత్ తమకు అత్యంత కీలక రక్షణ భాగస్వామి అని పేర్కొంది. ఈ సహకారంతో భారత్‌ తన రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. అయితే, ఈ ఒప్పందాల కారణంగా ప్రాంతీయ సైనిక సమతుల్యతలో ఎలాంటి మార్పు ఉండదని అమెరికా స్పష్టం చేసింది. అలాగే అమెరికా రక్షణ సిద్ధతపై కూడా ఈ ఒప్పందాల ప్రభావం ఉండబోదని వెల్లడించింది.

Advertisement