NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Uttarakhand: ఉత్తరాఖండ్ ఎస్టీఎఫ్‌ ఎన్‌కౌంటర్‌లో షూటర్ అమర్జీత్ హతం.. 15 కి పైగా కేసులలో వాంటెడ్ 
    తదుపరి వార్తా కథనం
    Uttarakhand: ఉత్తరాఖండ్ ఎస్టీఎఫ్‌ ఎన్‌కౌంటర్‌లో షూటర్ అమర్జీత్ హతం.. 15 కి పైగా కేసులలో వాంటెడ్ 
    ఉత్తరాఖండ్ ఎస్టీఎఫ్‌ ఎన్‌కౌంటర్‌లో షూటర్ అమర్జీత్ హతం..

    Uttarakhand: ఉత్తరాఖండ్ ఎస్టీఎఫ్‌ ఎన్‌కౌంటర్‌లో షూటర్ అమర్జీత్ హతం.. 15 కి పైగా కేసులలో వాంటెడ్ 

    వ్రాసిన వారు Stalin
    Apr 09, 2024
    12:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హరిద్వార్‌లోని భగవాన్‌పూర్ ప్రాంతంలో ఉత్తరాఖండ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్‌టిఎఫ్)తో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో బాబా తర్సేమ్ సింగ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు షూటర్ అమర్జీత్ హతమయ్యాడు.

    ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ డీజీపీ మంగళవారం ధృవీకరించారు.

    మార్చి 28న ఉధమ్‌సింగ్ నగర్‌లో నానక్‌మట్ట గురుద్వారాలోని 'కరసేవ' చీఫ్ బాబా టార్సేమ్ సింగ్‌ను బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్చి చంపారు.

    లక్ష రూపాయల రివార్డుతో ఉన్న షూటర్ అమర్జీత్ సింగ్ అలియాస్ బిట్టు ఉత్తరాఖండ్ ఎస్‌టిఎఫ్‌తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించగా,అతని సహచరుడు పరారీలో ఉన్నట్లు ఉత్తరాఖండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డిజిపి)అభినవ్ కుమార్ తెలిపారు.

    Details 

    రెండు రోజుల క్రితం పారితోషికం పెంపు 

    పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ఉత్తరాఖండ్ ఎస్టీఎఫ్, హరిద్వార్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించినట్లు డీజీపీ తెలిపారు.

    అమర్జీత్ సింగ్‌పై 16కి పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.

    అంతకుముందు ఆదివారం ఉధమ్‌సింగ్ నగర్ ఎస్‌ఎస్‌పి పరారీలో ఉన్న షూటర్లు అమర్జీత్ సింగ్, సరబ్‌జీత్ సింగ్‌లపై రివార్డ్ మొత్తాన్ని రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచారు.

    ఈ హత్య కేసులో మరో ముగ్గురు నిందితులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

    నేరస్థులను సమీకరించడం,వనరులను సమకూర్చడం,ఆయుధాలు సరఫరా చేయడం ద్వారా నేరం చేయడంలో వారు నిమగ్నమై ఉన్నారని పోలీసులు తెలిపారు.

    Details 

    నేరాలకు పాల్పడితే.. పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారు: డీజీపీ

    బాబా తర్సేమ్ సింగ్ హత్యను ఉత్తరాఖండ్ పోలీసులు సవాలుగా తీసుకున్నారని, హంతకులిద్దరి కోసం ఎస్టీఎఫ్, పోలీసులు నిరంతరం వెతుకుతున్నారని డీజీపీ కుమార్ చెప్పారు.

    ఉత్తరాఖండ్‌లో నేరస్థులు ఇలాంటి దారుణమైన నేరాలకు పాల్పడితే.. పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని డీజీపీ తెలిపారు.

    బాబా తర్సేమ్ సింగ్ హత్య కేసు తర్వాత, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా నిరంతరం నిఘా ఉంచారు. నిందితులను అరెస్టు చేయాలని పోలీసులకు కఠినమైన ఆదేశాలు ఇచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తరాఖండ్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    ఉత్తరాఖండ్

    ఉత్తరాఖండ్‌లో కుంభవృష్టి.. కుప్పకూలిన డెహ్రాడూన్‌ డిఫెన్స్‌ కాలేజ్ వరదలు
    మరోసారి ఉత్తరాదిలో కుంభవృష్టి.. ఒక్క హిమాచల్‌లోనే 51 మంది మృతి హిమాచల్ ప్రదేశ్
    ఉత్తరాఖండ్‌, హిమాచల్‌‌లో వర్షాల బీభత్సం; 66కు చేరిన మృతుల సంఖ్య  హిమాచల్ ప్రదేశ్
    ఉత్తరాఖండ్​లో ఏఎస్పీ బదిలీ.. హెలికాఫ్టర్ దిగిన సీఎంతో ఫోన్లో మాట్లాడుతూ సెల్యూట్ ముఖ్యమంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025