Page Loader
Bengaluru: ఉజ్బెకిస్థాన్ మహిళ అనుమానాస్పద మృతి 
Bengaluru: ఉజ్బెకిస్థాన్ మహిళ అనుమానాస్పద మృతి

Bengaluru: ఉజ్బెకిస్థాన్ మహిళ అనుమానాస్పద మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 14, 2024
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉజ్బెకిస్థాన్‌కు చెందిన 37 ఏళ్ల మహిళ బుధవారం బెంగళూరులోని తన హోటల్ గదిలో శవమై కనిపించిందని పోలీసులు తెలిపారు. జరీన్ మార్చి 5న బెంగళూరుకు వచ్చి నగరంలోని శేషాద్రిపురం ప్రాంతంలోని ఓ హోటల్‌లో బస చేసినట్లు డీఎస్పీ శేఖర్ తెలిపారు. బుధవారం సాయంత్రం 4:30 గంటలకు హోటల్ సిబ్బంది తలుపు తట్టారని, అయితే స్పందన రాలేదని తెలిపారు. దీంతో హోటల్ సిబ్బంది మాస్టర్ కీని ఉపయోగించి తలుపులు తెరిచి చూడగా జరీన్ శవమై కనిపించిందని పోలీసులు తెలిపారు. హోటల్ మేనేజర్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Details 

 విచారణ నిమిత్తం ఫోరెన్సిక్ బృందం, పోలీసులు, డాగ్ స్క్వాడ్

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బెంగళూరు సెంట్రల్ డీసీపీ శేఖర్ తెలిపారు. బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బౌరింగ్‌ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఫోరెన్సిక్ బృందం, పోలీసులు, డాగ్ స్క్వాడ్ విచారణ కోసం జరీన్ గదికి చేరుకున్నారు. హోటల్ మేనేజర్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ, హోటల్ రిజిస్టర్‌ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.