Page Loader
Election 2024: మోదీ చరిత్ర తిరిగి రాస్తారా ?. కాంగ్రెస్ 1984 రికార్డ్ బీజేపీ పునరావృతం చేయగలదా? 
మోదీ చరిత్ర తిరిగి రాస్తారా ?. కాంగ్రెస్ 1984 రికార్డ్ బీజేపీ పునరావృతం చేయగలదా?

Election 2024: మోదీ చరిత్ర తిరిగి రాస్తారా ?. కాంగ్రెస్ 1984 రికార్డ్ బీజేపీ పునరావృతం చేయగలదా? 

వ్రాసిన వారు Stalin
Jun 04, 2024
08:06 am

ఈ వార్తాకథనం ఏంటి

నరేంద్ర మోదీ మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారా ?- 12 ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలు NDA మళ్ళి అధికారంలోకి వస్తుంది అని చెప్పాయి . మరోవైపు మోదీ నేతృత్వంలోని బీజేపీ కూటమి(ఎన్డీయే) ఈసారి 400 సీట్లు కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ''ఆబ్ కీ బార్ 400 పార్'' నినాదంతో బీజేపీ నేతలు ఎన్నికల బరిలో నిలిచారు. బీజేపీ సొంతగా 370కి పైగా స్థానాలు సాధించడంతో పాటు ఎన్డీయే కూటమి ఈ సారి 400+ స్థానాలను సాధిస్తుందని ప్రధాని మోదీతో సహా అమిత్ షా ఇతర ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Details 

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు . బీజేపీ గెలుస్తుందని అంచనా ..

మూడు రోజుల క్రితం విడుదలైన పలు ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో బీజేపీ 400 స్థానాలు సాధిస్తుందని లెక్కలేశారు. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా, ఇండియా TV-CNX - బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీయే) 401 స్థానాలను సాధిస్తుందని చెప్పింది. న్యూస్24-టుడేస్ చాణక్య - ఇది 400 సీట్లను గెలుచుకుంటుందని అంచనా వేయగా, ABP న్యూస్-సి ఓటర్, జన్ కీ బాత్ మరియు న్యూస్ నేషన్ వరసగా 383, 392, 378 సీట్లు కైవసం చేసుకుంటుందని చెప్పింది.

details 

బీజేపీ గెలుపు పునరావృతం . ఈ రాష్ట్రాలు కీలకం .

అయితే, ఈ సారి బీజేపీ ఈ రికార్డును మరోసారి పునరావృతం చేయాలని భావిస్తోంది. 2024 ఎన్నికలు మొత్తం ఈ 400 సీట్ల చుట్టే తిరిగింది. ఈ మార్కు సాధించాలంటే బీజేపీ ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాలు కీలకం కానున్నాయి. ఈ రాష్ట్రాల్లో్ మిత్రపక్షాలతో కలిసి క్లీన్‌స్వీప్ చేస్తేనే సాధ్యపడుతుంది. వీటిలో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఎన్ని స్థానాలు సాధిస్తుందనే లెక్కపై ''400 పార్'' ఆధారపడి ఉంది.

details 

1984 లో కాంగ్రెస్ రికార్డ్ . బీజేపీ బ్రేక్ చేస్తుందా ?

బీజేపీ చెబుతున్నట్లు 400 సీట్లు గెలుచుకుంటే రికార్డ్ అని చెప్పవచ్చు. అంతకుముందు 1984లో ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన మొదటి ఎన్నికలలో కాంగ్రెస్ ఈ రికార్డును సాధించింది. 414 సాధించి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా అధికారం చేపట్టారు. ఇందిరాగాంధీ హత్య తర్వాత ఉవ్వెత్తున ఎగిసిన సానుభూతి పవనాల మధ్య కాంగ్రెస్ ఈ మార్కుని సాధించింది.