NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / APSSC : ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ జవాబు పత్రాల మూల్యాంకనం కుంభకోణం.. ధాత్రి మధుకు 14రోజుల రిమాండ్‌
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    APSSC : ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ జవాబు పత్రాల మూల్యాంకనం కుంభకోణం.. ధాత్రి మధుకు 14రోజుల రిమాండ్‌
    ధాత్రి మధుకు 14రోజుల రిమాండ్‌

    APSSC : ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ జవాబు పత్రాల మూల్యాంకనం కుంభకోణం.. ధాత్రి మధుకు 14రోజుల రిమాండ్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 07, 2025
    05:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన కుంభకోణం కేసులో అరెస్టయిన పమిడికాల్వ మధుసూదన్‌ అలియాస్‌ ధాత్రి మధును పోలీసులు విజయవాడ న్యాయస్థానంలో హాజరుపరిచారు.

    న్యాయస్థానం అతడిని ఈ నెల 21వ తేదీ వరకు రిమాండ్‌కి పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పోలీసులు మధుసూదన్‌ను జైలుకు తరలించారు.

    గ్రూప్‌-1 మెయిన్స్‌ సమాధాన పత్రాల మూల్యాంకనంలో జరిగిన అక్రమాల కేసులో మధుసూదన్‌ను మంగళవారం హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

    ఈ కేసులో ఆయన రెండవ నిందితుడిగా (ఏ2) ఉన్నారు.

    మధుసూదన్‌ క్యామ్‌సైన్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

    వివరాలు 

    నాటకంగా మూల్యాంకనం

    అప్పట్లో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు ఆదేశాలతోనే ఈ మూల్యాంకన ప్రక్రియలో విస్తృత స్థాయిలో అక్రమాలు జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

    హాయ్‌ల్యాండ్‌ ప్రాంతంలో మాన్యువల్‌ మూల్యాంకనం నిర్వహించలేదని, అయినా అది జరిగిందని నమ్మించేందుకు అర్హత లేని వ్యక్తులను, అనామకులను, గృహిణులను తాత్కాలికంగా నియమించి నాటకంగా మూల్యాంకనం చేసినట్లు విచారణలో తేలింది.

    అసలు జవాబు పత్రాలను వారు కనీసం తెరిచి కూడా చూడలేదని, క్యామ్‌సైన్‌ యాజమాన్యం పేర్కొన్న మార్కులనే పత్రాలపై నమోదు చేశామని వారు పోలీసుల విచారణలో పేర్కొన్నారు.

    వివరాలు 

    విచారణలో మధుసూదన్‌ పాత్రపై కీలక సమాచారం

    ఈ నేపథ్యంలో బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10లోని పంచవటి కాలనీలో ఉన్న క్యామ్‌సైన్‌ మీడియా కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించారు.

    దర్యాప్తు అధికారులు మధుసూదన్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించారు.

    విచారణలో ఆయన పాత్రపై కీలక సమాచారం కూడా వెలుగు చూసింది.

    విచారణ అనంతరం మంగళవారం రాత్రి మధుసూదన్‌ను అధికారికంగా అరెస్టు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం ఐపీఎల్
    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌

    ఆంధ్రప్రదేశ్

    Heatwave: ఆంధ్రప్రదేశ్‌లో వడగాలుల మోత.. 31 మండలాల్లో తీవ్రమైన వేడీ భారతదేశం
    Hepatitis: హెచ్చరిక.. ఏపీలో హెపటైటిస్ కేసులు పెరుగుతున్నాయి భారతదేశం
    MEGA DSC: ఏపీ మెగా డీఎస్సీ 2025.. దరఖాస్తు చేసేముందు తెలుసుకోవాల్సిన విషయాలివే! భారతదేశం
    Raj Kasireddy: ఏపీ సిట్‌ పోలీసులు అదుపులో కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025