NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తుని రైలు దహనం కేసును కొట్టేసిన విజయవాడ రైల్వే కోర్టు
    తుని రైలు దహనం కేసును కొట్టేసిన విజయవాడ రైల్వే కోర్టు
    భారతదేశం

    తుని రైలు దహనం కేసును కొట్టేసిన విజయవాడ రైల్వే కోర్టు

    వ్రాసిన వారు Naveen Stalin
    May 01, 2023 | 04:34 pm 0 నిమి చదవండి
    తుని రైలు దహనం కేసును కొట్టేసిన విజయవాడ రైల్వే కోర్టు
    తుని రైలు దహనం కేసును కొట్టేసిన విజయవాడ రైల్వే కోర్టు

    తూర్పుగోదావరి జిల్లా తుని వద్ద ఐదేళ్ల క్రితం రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను తగలబెట్టిన కేసును విజయవాడ రైల్వే కోర్టు సోమవారం కొట్టేసింది. రైల్వే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించి విచారణ చేయలేదని విజయవాడ రైల్వే కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలా సున్నితమైన అంశాన్ని విచారించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహించారని కోర్టు ప్రశ్నించింది. విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. రైలును తగలబెట్టిన కేసులో కేసులో మొత్తం 41 మందిని నిందితులుగా రైల్వే పోలీసులు పేర్కొన్నారు. ఇందులో ఏ1గా ముద్రగడ పద్మనాభం, ఏ2గా ఆకుల రామకృష్ణ, ఏ3గా దాడిశెట్టి రాజా ఉన్నారు.

    2016 జనవరి 31న ఎక్స్‌ప్రెస్‌ను తగలబెట్టిన ఆందోళనకారులు

    కాపు రిజర్వేషన్ల ఆందోళనకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా తుని వద్ద ఐదేళ్ల క్రితం రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను తగలబెట్టారు. ఈ కేసు అప్పట్లో సంచలనం రేపింది. మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం ఈ కేసులో ఏ1గా ఉన్నారు. ఆందోళనకారులపై స్థానిక పోలీసులు పెట్టిన కేసులను జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఉపసంహరించుకున్నప్పటికీ రైల్వే పోలీసులు మాత్రం వదిలిపెట్టలేదు. ఓబీసీ కోటా కింద కాపులకు రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తున్న సమయంలో 2016 జనవరి 31న ఎక్స్‌ప్రెస్‌ను తగలబెట్టినందుకు గాను ముద్రగడతో పాటు మరికొందరిపై భారతీయ రైల్వే చట్టంలోని సెక్షన్ 146, 147, 153, 174 కింద రైల్వే పోలీసులు కేసులు నమోదు చేశారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తూర్పుగోదావరి జిల్లా
    తాజా వార్తలు
    ఆంధ్రప్రదేశ్

    తూర్పుగోదావరి జిల్లా

    తూర్పుగోదావరి: తరగతి గదిలో దారణం; తోటి విద్యార్థిని కత్తితో పొడిచిన మరో స్టూడెంట్ రాజానగరం
    విద్యా దీవెన నిధులు విడుదల; విద్యార్థిణి స్పీచ్‌కు ముగ్ధుడైన సీఎం జగన్  ఆంధ్రప్రదేశ్

    తాజా వార్తలు

    ఈడీ విచారణను బైజూస్ ఎందుకు ఎదుర్కొంటుందో తెలుసా?  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు ఐఎండీ
    విడాకులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు; 6నెలల వెయిటింగ్ పీరియడ్‌ అవసరం లేదని తీర్పు సుప్రీంకోర్టు
    కర్ణాటకలో బీజేపీ మేనిఫెస్టో; ఏడాదికి మూడు సిలిండర్లు, రోజుకు అర లీటర్ నందిని పాలు ఉచితం  కర్ణాటక

    ఆంధ్రప్రదేశ్

    APSRTC: పాడేరు, అరకులోయ, బొర్రా గుహలకు 'ఏపీఎస్ఆర్టీసీ' ప్రత్యేక టూర్ ప్యాకేజీ  ఏపీఎస్ఆర్టీసీ
    వైఎస్ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జూన్ 5కి వాయిదా తెలంగాణ
    చేతిపంపు కొట్టుకొని నీళ్లు తాగిన ఏనుగు; వీడియో వైరల్  పార్వతీపురం మన్యం జిల్లా
    బిహార్ డాన్ ఆనంద్ మోహన్ సింగ్ విడుదలపై ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అసోసియేషన్ అభ్యంతరం  బిహార్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023