NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తుని రైలు దహనం కేసును కొట్టేసిన విజయవాడ రైల్వే కోర్టు
    తదుపరి వార్తా కథనం
    తుని రైలు దహనం కేసును కొట్టేసిన విజయవాడ రైల్వే కోర్టు
    తుని రైలు దహనం కేసును కొట్టేసిన విజయవాడ రైల్వే కోర్టు

    తుని రైలు దహనం కేసును కొట్టేసిన విజయవాడ రైల్వే కోర్టు

    వ్రాసిన వారు Stalin
    May 01, 2023
    04:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తూర్పుగోదావరి జిల్లా తుని వద్ద ఐదేళ్ల క్రితం రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను తగలబెట్టిన కేసును విజయవాడ రైల్వే కోర్టు సోమవారం కొట్టేసింది.

    రైల్వే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించి విచారణ చేయలేదని విజయవాడ రైల్వే కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

    చాలా సున్నితమైన అంశాన్ని విచారించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహించారని కోర్టు ప్రశ్నించింది. విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.

    రైలును తగలబెట్టిన కేసులో కేసులో మొత్తం 41 మందిని నిందితులుగా రైల్వే పోలీసులు పేర్కొన్నారు. ఇందులో ఏ1గా ముద్రగడ పద్మనాభం, ఏ2గా ఆకుల రామకృష్ణ, ఏ3గా దాడిశెట్టి రాజా ఉన్నారు.

    విజయవాడ

    2016 జనవరి 31న ఎక్స్‌ప్రెస్‌ను తగలబెట్టిన ఆందోళనకారులు

    కాపు రిజర్వేషన్ల ఆందోళనకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా తుని వద్ద ఐదేళ్ల క్రితం రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను తగలబెట్టారు. ఈ కేసు అప్పట్లో సంచలనం రేపింది.

    మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం ఈ కేసులో ఏ1గా ఉన్నారు.

    ఆందోళనకారులపై స్థానిక పోలీసులు పెట్టిన కేసులను జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఉపసంహరించుకున్నప్పటికీ రైల్వే పోలీసులు మాత్రం వదిలిపెట్టలేదు.

    ఓబీసీ కోటా కింద కాపులకు రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తున్న సమయంలో 2016 జనవరి 31న ఎక్స్‌ప్రెస్‌ను తగలబెట్టినందుకు గాను ముద్రగడతో పాటు మరికొందరిపై భారతీయ రైల్వే చట్టంలోని సెక్షన్ 146, 147, 153, 174 కింద రైల్వే పోలీసులు కేసులు నమోదు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తూర్పుగోదావరి జిల్లా
    తాజా వార్తలు
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    తూర్పుగోదావరి జిల్లా

    తూర్పుగోదావరి: తరగతి గదిలో దారణం; తోటి విద్యార్థిని కత్తితో పొడిచిన మరో స్టూడెంట్ రాజానగరం

    తాజా వార్తలు

    దేశంలో కొత్తగా 9,355 మందికి కరోనా; 26 మరణాలు  కరోనా కొత్త కేసులు
    TS EAMCET-2023: తెలంగాణ ఎంసెట్‌కు పరీక్షాల కేంద్రాల పెంపు; భారీగా పెరిగిన అప్లికేషన్లు తెలంగాణ
    భూమికి కొత్త ముప్పు; నక్షత్రాలు పేలి ధరణిపైకి దూసుకొస్తున్న ప్రమాదకర ఎక్స్-కిరణాలు  భూమి
    'డొనాల్డ్ ట్రంప్ నన్ను రేప్ చేశారు': న్యూయార్క్ కోర్టులో దావా వేసిన రచయిత డొనాల్డ్ ట్రంప్

    ఆంధ్రప్రదేశ్

    నేడు బీజేపీలోకి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి! బీజేపీ
    ఆంధ్రప్రదేశ్: బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ
    ఏప్రిల్ 10, 11 తేదీల్లో కరోనా మాక్ డ్రిల్; ఆరోగ్య శాఖ ఏర్పాట్లు కోవిడ్
    అనంతపురం ఆర్టీఏ ఆఫీస్ సమీపంలో భారీ పేలుడు; ఒకరు దర్మరణం అనంతపురం అర్బన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025