Loading...
AP Metro Rail Projects: విశాఖ, విజయవాడ మెట్రోకు కీలక ముందడుగు.. డీపీఆర్‌లపై ఆర్థిక మదింపు

AP Metro Rail Projects: విశాఖ, విజయవాడ మెట్రోకు కీలక ముందడుగు.. డీపీఆర్‌లపై ఆర్థిక మదింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 10, 2026
08:02 am

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్టణం,విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులు మరో కీలక దశలోకి ప్రవేశించాయి. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను (డీపీఆర్‌) కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మదింపు కోసం సంబంధిత విభాగానికి పంపింది. తొలి దశలో రెండు నగరాల్లో కలిపి 84.63 కిలోమీటర్ల మేర మెట్రో నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఇందుకోసం మొత్తం రూ.21,616 కోట్ల పెట్టుబడి అవసరమవుతుందని అంచనా వేశారు. విశాఖపట్నంలో స్టీల్‌ప్లాంట్‌ నుంచి నగరంలోని ముఖ్య ప్రాంతాలకు మెట్రో అనుసంధానం కల్పించనున్నారు. దీంతో స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులు,నగర ప్రజల రాకపోకలు మరింత సులభం కానున్నాయి. విజయవాడలో గన్నవరం నుంచి మెట్రో కారిడార్‌ను ఏర్పాటు చేయడం ద్వారా విమానాశ్రయాన్ని నగరంలోని ప్రధాన నివాస,వాణిజ్య ప్రాంతాలతో అనుసంధానించనున్నారు.

వివరాలు 

జేవీ మోడల్‌లో ఈ రెండు ప్రాజెక్టులు 

ఫలితంగా ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు మెట్రో ప్రాజెక్టుల డీపీఆర్‌లను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది.

నివేదికలను పరిశీలించిన కేంద్రం కొన్ని అభ్యంతరాలు,సూచనలు వెల్లడించింది.

వాటిని పరిగణనలోకి తీసుకున్న అనంతరం కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ డీపీఆర్‌లను ఆర్థిక మదింపునకు పంపేందుకు అనుమతి ఇచ్చింది.

ఈ రెండు ప్రాజెక్టులను సంయుక్త భాగస్వామ్య విధానం (జేవీ మోడల్‌)లో చేపట్టనున్నారు.

ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం, కేంద్ర ప్రభుత్వం మరో 20 శాతం చొప్పున నిధులు సమకూర్చనున్నాయి.

మిగిలిన 60 శాతం మొత్తాన్ని వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు, ఇతర మార్గాల ద్వారా సమీకరించనున్నారు.

వివరాలు 

రవాణాపై ఒత్తిడి తగ్గే అవకాశం

ఇప్పటికే కొన్ని విదేశీ బ్యాంకులు ఈ ప్రాజెక్టులకు రుణాలు అందించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

విశాఖపట్నం ఇప్పటికే పారిశ్రామిక,ఐటీ, పర్యాటక రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోంది.

విజయవాడ మాత్రం వాణిజ్యం,రవాణా,పరిపాలనా కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా కొనసాగుతోంది.

ఈ రెండు నగరాల్లో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వస్తే ప్రస్తుత రోడ్డు రవాణాపై ఉన్న ఒత్తిడి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

మెట్రో రాకతో ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు రెండు నగరాల్లో ఆర్థిక కార్యకలాపాలు మరింత విస్తరించే అవకాశముంది.

ప్రస్తుతం కొన్ని ప్రాంతాలకే పరిమితమైన నగర అభివృద్ధి మెట్రో కారిడార్ల వెంట విస్తరించవచ్చని అంచనా.

కొత్త వాణిజ్య, నివాస, ఆర్థిక వృద్ధి కేంద్రాలు ఏర్పడేందుకు మెట్రో అనుసంధానం దోహదపడే అవకాశం ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

రవాణాపై ఒత్తిడి తగ్గే అవకాశం

మెట్రో రైల్‌ ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 40 శాతం వరకు పనులకు సంబంధించిన టెండరింగ్‌ ప్రక్రియను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైల్‌ కార్పొరేషన్‌కు ఇప్పటికే సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది.

ప్రస్తుతం డీపీఆర్‌లపై ఆర్థిక మదింపు కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది.

ఆమోదం లభిస్తే తొలి దశ పనులు ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు వేగం పుంజుకోనున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

విజయవాడలో ఎస్‌ఐఏ సర్వే ప్రారంభం

విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెక్టులో భాగంగా సోషల్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ (ఎస్‌ఐఏ) సర్వేను అధికారులు ప్రారంభించారు.

బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, గన్నవరం, పెనమలూరు ప్రాంతాల్లో ఈ సర్వే కొనసాగుతోంది.

ప్రతిపాదిత రెండు మెట్రో కారిడార్ల నిర్మాణానికి సుమారు 80 ఎకరాల భూమి అవసరమవుతుందని అధికారులు గుర్తించారు.

ఈ భూమిలో మెట్రో రైళ్ల కోసం కోచ్‌ డిపోతో పాటు వివిధ మెట్రో స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.

వివరాలు 

విజయవాడలో ఎస్‌ఐఏ సర్వే ప్రారంభం

భూసేకరణ వల్ల స్థానికంగా ఏర్పడే సామాజిక ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఈ సర్వే చేపడుతున్నారు.

అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (ఆస్కీ), రెవెన్యూ అధికారుల బృందాలు కలిసి ఎస్‌ఐఏ సర్వేను నిర్వహిస్తున్నాయి.

సర్వే ప్రక్రియ పూర్తయిన తర్వాత భూసేకరణకు సంబంధించి జిల్లా యంత్రాంగం అధికారిక నోటిఫికేషన్‌ జారీ చేయనుంది.

దీంతో విజయవాడ మెట్రో ప్రాజెక్టులో భూసేకరణ ప్రక్రియ కూడా ముందుకు సాగే అవకాశం ఉంది.

ADVERTISEMENT