NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Vizag Steel: ప్యాకేజీతో హడావుడి..మరోపక్క సిబ్బంది తగ్గింపు..అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఏం జరుగుతోంది?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Vizag Steel: ప్యాకేజీతో హడావుడి..మరోపక్క సిబ్బంది తగ్గింపు..అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఏం జరుగుతోంది?
    ప్యాకేజీతో హడావుడి..మరోపక్క సిబ్బంది తగ్గింపు..అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఏం జరుగుతోంది?

    Vizag Steel: ప్యాకేజీతో హడావుడి..మరోపక్క సిబ్బంది తగ్గింపు..అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఏం జరుగుతోంది?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 23, 2025
    04:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రభుత్వంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చెబుతున్నారు.

    కానీ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం తీసుకుంటున్న చర్యలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి.

    భద్రతా సిబ్బందిని తగ్గించడం, ప్రైవేటీకరణ దిశగా ముందు అడుగులుగా కార్మిక సంఘాల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

    స్టీల్‌ప్లాంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫైర్ స్టేషన్‌ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు టెండర్లు పిలిచారు.

    వివరాలు 

    ప్యాకేజీతో చర్చలు, కానీ ప్రైవేటీకరణ ఆగదు 

    కార్మిక సంఘాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు పునరుద్ధరణ ప్యాకేజీపై చర్చలు జరుపుతుండగా, మరోవైపు ప్రైవేటీకరణ చర్యలు ఆపడం లేదని కార్మిక సంఘాల నాయకుడు సీహెచ్ నర్సింగ్ రావు విమర్శించారు.

    కాంట్రాక్టు ఉద్యోగులలో సుమారు 800 మందిని పునరుద్ధరించలేదు. ఇంకా ఉద్యోగులను వీఆర్ఎస్ పథకం కింద పంపే ప్రక్రియ కొనసాగుతోంది.

    సిబ్బంది తగ్గింపు

    సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బందిని తగ్గించేందుకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన గేటు వద్ద వాహనాల తనిఖీ చేసే సిబ్బంది సంఖ్యను బుధవారం నుంచి తగ్గించారు.

    వివరాలు 

    మెడికల్ స్కీం - మార్పులు 

    రిటైర్డ్ ఉద్యోగుల మెడికల్ స్కీం లో భారీ కోతలను ప్రతిపాదించారు.

    జీఎంఎస్ స్కీం కింద 6 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ అందిస్తారు, కానీ ఉద్యోగులపై అదనపు ఆర్థిక భారం పెరుగుతోంది.

    ఓపీడీ రీయింబర్స్‌మెంట్ విధానంలో కూడా 30% వంతు ఉద్యోగులు భరించాల్సి ఉంటుంది.

    ప్యాకేజీపై అనిశ్చితి

    కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పునరుద్ధరణ ప్యాకేజీకి సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా విడుదల కాలేదు.

    ప్యాకేజీ మొత్తం రూ.11,444 కోట్లుగా ప్రకటించగా, మొదటి విడతగా రూ.10,300 కోట్ల ఖర్చుపై స్పష్టత లేదు.

    వివరాలు 

    వీఆర్ఎస్ - పెద్ద సంఖ్యలో దరఖాస్తులు 

    ఇప్పటి వరకు 700 మంది ఉద్యోగులు వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేశారు.

    ఈ నెల చివరి వరకు వీఆర్ఎస్ దరఖాస్తులకు గడువు ఉంది.

    12,300 మంది శాశ్వత ఉద్యోగుల్లో 800 మంది ఈ ఏడాది రిటైర్ కానున్నారు, దీని వల్ల ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశాఖపట్టణం

    తాజా

    PBKS vs MI: ముంబయి ఇండియన్స్ ఓటమి.. ఫైనల్‌లో అడుగుపెట్టిన పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్
    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్

    విశాఖపట్టణం

    Ap Government : ఆంధ్రప్రదేశ్ సర్కారుకు హైకోర్టు షాక్.. విశాఖకు కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో హైకోర్టు
    Rajahmundry: రైలులో బిర్యానీ తిని 9 మందికి తీవ్ర అస్వస్థత  వైజాగ్
    Visakha Gang Rape : విశాఖలో దారుణం.. బాలికపై 10మంది గ్యాంగ్ రేప్  ఆంధ్రప్రదేశ్
    Coronavirus: వైజాగ్‌లో కరోనా కలవరం.. అధికారుల అలర్ట్  కరోనా కొత్త కేసులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025