Page Loader
'I am sorry': ఓటమి నేర్పిన గుణపాఠం.. క్రియాశీల రాజకీయాలకు వీకే పాండియన్‌ గుడ్ బై
ఓటమి నేర్పిన గుణపాఠం.. క్రియాశీల రాజకీయాలకు వీకే పాండియన్‌ గుడ్ బై

'I am sorry': ఓటమి నేర్పిన గుణపాఠం.. క్రియాశీల రాజకీయాలకు వీకే పాండియన్‌ గుడ్ బై

వ్రాసిన వారు Stalin
Jun 09, 2024
05:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

నవీన్‌ పట్నాయక్‌ సహాయకుడు వీకే పాండియన్‌ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆదివారం ప్రకటించారు. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ ఓటమి పాలైన కొద్ది రోజులకే ఈ ప్రకటన వెలువడింది. "ఇప్పుడు, నేను క్రియాశీల రాజకీయాల నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. ఈ ప్రయాణంలో నేను ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి. నాపై ఈ ప్రచార కథనం BJD యొ నష్టంలో పాత్ర పోషించినట్లయితే క్షమించండి" అని VK పాండియన్ అన్నారు.

వీకే పాండియన్‌

VK పాండియన్ వాదన ఇలా 

ఆదివారం, బిజూ జనతాదళ్ నాయకుడు , 5T ఛైర్మన్ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. నేను చాలా నిరాడంబరమైన కుటుంబం నుండి , ఒక చిన్న గ్రామం నుండి వచ్చాను, IAS లో చేరి ప్రజలకు సేవ చేయాలనేది నా చిన్ననాటి కోరిక. జగన్నాథ భగవానుడు దానిని నెరవేర్చాడు. కేంద్రపారా నుండి నా కుటుంబం కారణంగా, నేను ఒడిశాకు వచ్చాను. నేను ఒడిశా గడ్డపై అడుగు పెట్టిన రోజు, ఒడిశా ప్రజల నుండి అపారమైన ప్రేమ , గౌరవం పొందాను, నేను ప్రజల కోసం చాలా కష్టపడ్డాను. 12 సంవత్సరాల క్రితం ఒడిశా ముఖ్యమంత్రి కార్యాలయంలో చేరిన పాండియన్, నవీన్ పట్నాయక్ కోసం పని చేయడం "గౌరవం" అని పేర్కొన్నారు.

ఒడిషా 

12 ఏళ్లుగా తాను కష్టపడి పనిచేశా 

ఒడిషా కోసం నవీన్ కు వున్న దార్శనికతను అమలు చేయాలని నా నుండి ఆయన కోరుకున్నారని తెలిపారు. అందుకు అనుగుణంగా ఆయన కోరుకున్న విధంగా ఆరోగ్యం, విద్య, పేదరికం తగ్గింపులో అనేక మైలురాళ్లను విజయవంతంగా దాటారని వికె పాండియన్ వివరించారు. గత 12 ఏళ్లుగా తాను కష్టపడి పనిచేశానని, ఒడిశా, నవీన్‌ బాబులను దృష్టిలో ఉంచుకుని పనిచేశానని పాండియన్‌ చెప్పారు. కాగా పాండియన్‌ స్వస్ధలం తమిళనాడు. పార్టీని నమ్ముకుని చాలా కాలంగా వున్న వ్యక్తులను వదిలి వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పగించటంపై నిరసన సెగ తగిలింది. పార్టీతో సహా ప్రజల్లో నవీన్‌ పై అసహనం వ్యక్తమైంది. దీనిని బిజెపి రాజకీయంగా వాడుకుని లబ్ధి పొందిందని అభిప్రాయం వ్యక్తమౌతోంది.