NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Coaching Centres: కోచింగ్‌ సెంటర్లకు హెచ్చరిక.. '100 శాతం సెలెక్షన్' ప్రకటనలపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు
    తదుపరి వార్తా కథనం
    Coaching Centres: కోచింగ్‌ సెంటర్లకు హెచ్చరిక.. '100 శాతం సెలెక్షన్' ప్రకటనలపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు
    కోచింగ్‌ సెంటర్లకు హెచ్చరిక.. '100 శాతం సెలెక్షన్' ప్రకటనలపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

    Coaching Centres: కోచింగ్‌ సెంటర్లకు హెచ్చరిక.. '100 శాతం సెలెక్షన్' ప్రకటనలపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 13, 2024
    04:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర ప్రభుత్వం వివిధ పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్లపై నూతన మార్గదర్శకాలను జారీ చేసింది.

    కోచింగ్ సెంటర్లు చేసే తప్పుడు ప్రకటనలు, ఉదాహరణకు '100 శాతం జాబ్ గ్యారెంటీ' లేదా '100 శాతం సెలెక్షన్' వంటి అసత్య వాగ్దానాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంది.

    కేంద్ర వినియోగదారుల భద్రతా సంస్థకు ఫిర్యాదుల రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

    ఈ అంశంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే మాట్లాడారు.

    Details

    హానీ కలిగించే ప్రకటనలు ఇవ్వరాదు

    తమ సక్సెస్‌ రేటు, సివిల్స్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు తీసుకున్న కోర్సులు మొదలైన విషయాల గురించి కోచింగ్ సెంటర్లు ఉద్దేశపూర్వకంగా విద్యార్థుల నుంచి కొంత సమాచారాన్ని దాస్తుండడం తాము గమనించామని చెప్పారు.

    అందువల్ల వాటి నిర్వాహకుల కోసం పలు మార్గదర్శకాలు రూపొందించామని ఆయన తెలియజేశారు.

    విద్యార్థుల హక్కులకు హాని కలిగించే విధంగా ప్రకటనలు చేయకూడదని కేంద్రం వివిధ మార్గదర్శకాలను రూపొందించింది.

    Details

    కేంద్రం చేసిన మార్గదర్శకాలు ఇవే 

    1. కోచింగ్ సెంటర్లు తమ కోర్సుల గురించి, అలాగే వాటి వ్యవధి గురించి తప్పుగా ప్రకటనలు చేయకూడదు.

    2. అభ్యర్థుల రాతపూర్వక అనుమతి లేకుండా, కోచింగ్ సెంటర్లు అభ్యర్థుల పేర్లు, ఫోటోలను ప్రదర్శించకూడదు.

    3. కోర్సుల సంబంధిత ముఖ్యమైన సమాచారాన్ని బహిరంగంగా వెల్లడించాలి.

    4. యూపీఎస్సీ అభ్యర్థులు సాధారణంగా ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షలు స్వతంత్రంగా రాయటంతో, కోచింగ్ సెంటర్లు ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలి.

    5. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు, తమ కోచింగ్ సెంటర్ల గురించి కూడా వివరాలు ఇవ్వాలి.

    6. కోచింగ్ సెంటర్లు చట్టబద్ధంగా అనుమతి పొందిన భవనాలలో మాత్రమే ఏర్పాటు చేయాలి.

    7. విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు మరియు భద్రత అందించాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం
    ఇండియా

    తాజా

    Nambala Kesava Rao: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు మృతి  ఛత్తీస్‌గఢ్
    Virat Anushka: పికిల్‌బాల్ కోర్టులో విరాట్, అనుష్క జంట  విరాట్ కోహ్లీ
    Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 410 పాయింట్లు, నిఫ్టీ 129 పాయింట్లు  స్టాక్ మార్కెట్
    MI vs DC: ఒకే స్థానం.. రెండు జట్లు.. వాంఖడేలో సమరం షూరు! ముంబయి ఇండియన్స్

    కేంద్ర ప్రభుత్వం

    8th Pay Commission:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..8వ వేతన సంఘం ఏర్పాటుపై కీలక నిర్ణయం  బిజినెస్
    Central Scheme: తెల్లరేషన్ కార్డుదారులకు త్వరలో గుడ్ న్యూస్.. రేషన్ స్కీం క్రింద బియ్యంతో పాటు ఈ 9 సరుకులు ఫ్రీ..  బిజినెస్
    Fifty Airports: ఐదేళ్లలో 50 కొత్త విమానాశ్రయాలను నిమించనున్న కేంద్ర ప్రభుత్వం భారతదేశం
    Onion Price: సామాన్యులకు కేంద్ర శుభవార్త.. తగ్గనున్న ఉల్లి ధరలు బిజినెస్

    ఇండియా

    Saibaba: దిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ సాయిబాబా కన్నుమూత దిల్లీ
    Rajmargyatra: 'రాజ్‌మార్గ్ యాత్ర'.. ఫాస్టాగ్ రీఛార్జీ, స్పీడ్‌ అలర్ట్స్‌ ఒక్క యాప్‌లో! ప్రయాణం
    Firing At Durga Puja Pandal: బీహార్‌లో దుర్గా పూజా మండపం వద్ద కాల్పులు.. నలుగురికి గాయాలు బిహార్
    Saibaba: ప్రొఫెసర్ సాయిబాబా మృతదేహాన్ని ఆస్పత్రికి దానం చేసిన కుటుంబ సభ్యులు హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025