NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: ఉగ్రవాదులను చావు దెబ్బకొట్టాం.. సైనికుల ధైర్యానికి దేశం గర్విస్తోంది : మోదీ
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    PM Modi: ఉగ్రవాదులను చావు దెబ్బకొట్టాం.. సైనికుల ధైర్యానికి దేశం గర్విస్తోంది : మోదీ
    ఉగ్రవాదులను చావు దెబ్బకొట్టాం.. సైనికుల ధైర్యానికి దేశం గర్విస్తోంది : మోదీ

    PM Modi: ఉగ్రవాదులను చావు దెబ్బకొట్టాం.. సైనికుల ధైర్యానికి దేశం గర్విస్తోంది : మోదీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 12, 2025
    08:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉగ్ర దాడులతో దేశవ్యాప్తంగా ప్రతి హృదయం రగిలిపోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

    ఈ క్రమంలో పౌరులు, అన్ని రాజకీయ పార్టీలు ఒకే వేదికపైకి వచ్చి ఉగ్రవాదానికి విరుద్ధంగా కలిసికట్టుగా స్పందించాయని తెలిపారు.

    ఉగ్రవాద శిబిరాలపై భారత్ మిసైళ్లతో విరుచుకుపడిందని, ఆ దాడులు ఉగ్రవాదులు కలల్లో కూడా ఊహించలేని రీతిలో జరిగాయని పేర్కొన్నారు.

    భారత్ చేపట్టిన దాడుల ప్రభావంతో గందరగోళానికి గురైన పాకిస్థాన్, మన దేశంలోని పాఠశాలలు, జనవాసాలపై దాడులకు పాల్పడిందని మోదీ తీవ్రంగా ధ్వజమెత్తారు.

    ఈ దాడులకు భారత్ తగిన బుద్ధి చెప్పిందని, కేవలం మూడురోజుల్లోనే భారత దళాలు పాక్‌ను తికమకకు గురి చేశాయని వెల్లడించారు.

    Details

    పాకిస్థాన్ వెనుకడుగేసింది

    వెంటనే భయబ్రాంతులకు గురైన పాక్, మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO)తో చర్చలకు దిగిందని తెలిపారు.

    భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పాక్ క్షిపణులను గాల్లోనే పేల్చేశాయని, దీన్ని యావత్ ప్రపంచం చూసిందని మోదీ గర్వంగా చెప్పారు.

    భారత ఆర్మీ ప్రతీకార దాడుల్ని చూసి పాకిస్థాన్ వెనుకడుగేసిందన్నారు. "ఆపరేషన్ సింధూర్" ఎలాంటి సాధారణ ఆపరేషన్ కాదని, అది యావత్ భారతదేశ ప్రజల ఆవేశానికి ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు.

    ఈ ఆపరేషన్‌లో సైనికులు ప్రదర్శించిన ధైర్యాన్ని మోదీ అభినందించారు.

    Details

    ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే గుణపాఠం చెబుతాం

    పహల్గామ్ ఘటనపై స్పందించిన ప్రధాని, తమ కళ్లముందే సొంత వారిని అత్యంత చంపడంపై మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

    పాకిస్థాన్‌ అణు బ్లాక్‌మెయిలింగ్‌ ఇక సహించే ప్రసస్తే లేదన్నారు. అణుశక్తి, అణ్వాయుధాల ఆధారంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే, భారత్‌ గట్టి గుణపాఠం చెబుతున్నారు.

    ఉగ్రవాదం ఏ రూపంలో ఎక్కడ ఉన్నా భారత్‌ అంతం చేస్తుందని మోదీ ప్రసంగించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    PM Modi: ఉగ్రవాదులను చావు దెబ్బకొట్టాం.. సైనికుల ధైర్యానికి దేశం గర్విస్తోంది : మోదీ నరేంద్ర మోదీ
    Truecaller: ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్.. స్పామ్ సందేశాలకు చెక్‌! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూట్ రీస్టార్ట్.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం! నరేంద్ర మోదీ

    నరేంద్ర మోదీ

    PM Modi: సౌదీ అరేబియాకు బయల్దేరి వెళ్లిన మోదీ.. రెండు రోజుల పాటు వివిధ కార్యక్రమాలకు హాజరు భారతదేశం
    Smart City Mission: పదేళ్లలో స్మార్ట్‌ సిటీలకు రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు చేసిన భారత్‌ ప్రధాన మంత్రి
    PM Modi: సౌదీ గగనంలో మోదీకి ఘన స్వాగతం.. ఎస్కార్ట్‌గా సౌదీ ఫైటర్‌ జెట్‌లు సౌదీ అరేబియా
    Donald Trump : జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడి.. ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. అండగా ఉంటామని హామీ డొనాల్డ్ ట్రంప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025