Loading...
Pellet Guns: సీజేపీ 'సంసద్ చలో' ర్యాలీలో పెలెట్ గన్స్ వాడినట్లు ఆరోపణలు.. నిజం ఏంటి?
సీజేపీ 'సంసద్ చలో' ర్యాలీలో పెలెట్ గన్స్ వాడినట్లు ఆరోపణలు.. నిజం ఏంటి?

Pellet Guns: సీజేపీ 'సంసద్ చలో' ర్యాలీలో పెలెట్ గన్స్ వాడినట్లు ఆరోపణలు.. నిజం ఏంటి?

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 24, 2026
05:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలో జూలై 20న జరిగిన కాక్‌రోచ్ జనతా పార్టీ(సీజేపీ)'సంసద్ చలో' నిరసనలో పెలెట్ గన్స్ వాడారా అనే అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని,నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీజేపీ నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తంగా మారిన తర్వాత, పలువురు నిరసనకారులు పెలెట్ గాయాలతో చికిత్స పొందుతున్నట్లు ఫొటోలు,వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఢిల్లీ పోలీసులు మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తూ తమ వద్ద పెలెట్ గన్స్ లేవని, వాటిని ఎప్పుడూ ఉపయోగించలేదని స్పష్టం చేశారు. పెలెట్ గన్ అనేది గన్‌పౌడర్‌కు బదులుగా గాలి, గ్యాస్ లేదా స్ప్రింగ్ ఒత్తిడితో చిన్న లోహపు గుళికలను ప్రయోగించే ఆయుధం.

వివరాలు 

పెలెట్ గాయాలతో పలువురు ఆస్పత్రుల్లో..

క్రీడలు, క్రిమి నియంత్రణతో పాటు కొన్ని సందర్భాల్లో గుంపులను చెదరగొట్టేందుకు కూడా వీటిని వినియోగిస్తారు.

గతంలో 2024రైతుల ఆందోళనలు,2023మణిపూర్ విద్యార్థుల నిరసనలు,2016కశ్మీర్ అశాంతి సమయంలో కేంద్ర బలగాలు వీటిని ఉపయోగించినట్లు నమోదైంది.

జూలై 20ర్యాలీ హింసాత్మకంగా మారిన తర్వాత పెలెట్ గాయాలతో పలువురు ఆస్పత్రుల్లో చేరినట్లు పలు మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.

ఢిల్లీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్‌కు చెందిన 19 ఏళ్ల విద్యార్థి సాహిల్ లోచబ్ శరీరానికి కుడి వైపు పెలెట్ గాయాలు అయ్యాయని ఎయిమ్స్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి ధృవీకరించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.

వివరాలు 

ఒక విద్యార్థి కుడి కంటిలో లోహపు ముక్కలు

అతని కుడి కంటిలో ఇప్పటికీ లోహపు ముక్కలు ఉండటంతో శస్త్రచికిత్స నిర్వహించగా,చూపు తిరిగి వచ్చే అవకాశాలు కేవలం ఒకశాతం మాత్రమే ఉన్నాయని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపినట్లు కథనంలో పేర్కొన్నారు.

సాహిల్ మాట్లాడుతూ తనకు ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు రాసే భవిష్యత్తే ప్రమాదంలో పడిందని, ఇప్పటివరకు ప్రభుత్వ ప్రతినిధులు గానీ,సీజేపీ నేతలు గానీ తనను పరామర్శించలేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు నివేదికలు తెలిపాయి.

తనకు ఉద్యోగంకల్పించి భవిష్యత్తును భద్రపరచాలని ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు.

ఇది ఒక్కఘటన మాత్రమే కాదని,మరో నిరసనకారుడుషేక్ ఇర్షాద్ మన్‌సూరీ కూడా పెలెట్ గాయాలతో చికిత్స పొందుతున్నట్లు ది హిందూ వెల్లడించింది.

ఢిల్లీలో పౌరులపై భద్రతా బలగాలు పెలెట్ గన్స్ ఉపయోగించారనే తొలి ఘటనగా ఇది భావిస్తున్నట్లు కథనంలో పేర్కొంది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రానా అయ్యుబ్ చేసిన ట్వీట్ 

ADVERTISEMENT

వివరాలు 

80 మందిలో ఒకరికి పెలెట్ గాయాలు

మన్‌సూరీతో కలిసి వచ్చిన స్నేహితుడు తెలిపిన వివరాల ప్రకారం,కనాట్ ప్లేస్‌లోని పాలికా బజార్ సమీపంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్) సిబ్బంది కాల్పులు జరపడంతో అతడికి గాయాలయ్యాయి.

ప్రస్తుతం చికిత్స పొందుతున్న లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీ వర్గాల సమాచారం ప్రకారం, సీజేపీ ర్యాలీలో గాయపడిన సుమారు 80 మందిలో కనీసం ఒకరికి పెలెట్ గాయాలు ఉన్నట్లు గుర్తించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

వివరాలు 

ఆర్‌ఏఎఫ్ సిబ్బంది వద్ద పెలెట్ గన్స్‌తో పాటు షాక్ బాటన్లు

లేడీ హార్డింజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎంబీఏ పట్టభద్రుడు మన్‌సూరీ మాట్లాడుతూ, ఆర్‌ఏఎఫ్ సిబ్బంది ప్రయోగించిన అనేక పెలెట్లు తనకు తగిలాయని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు తెలిపారు.

జూలై 20న జంతర్ మంతర్ పరిసరాల్లో విధుల్లో ఉన్న ఆర్‌ఏఎఫ్ సిబ్బంది వద్ద పెలెట్ గన్స్‌తో పాటు షాక్ బాటన్లు కూడా ఉన్నాయని అదే కథనం పేర్కొంది.

ఇక అవుట్‌లుక్ జర్నలిస్టు కూడా ఈ నిరసనను కవర్ చేస్తున్న సమయంలో పెలెట్‌లాంటి గాయాలు అయ్యాయని, తన వైద్య రికార్డుల్లో కూడా అవి నమోదైనట్లు వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మొహ్మద్ జుబైర్ చేసిన ట్వీట్ 

వివరాలు 

ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఢిల్లీ పోలీసులు

సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ కూడా ఎక్స్ వేదికగా ఓ నిరసనకారుడి గాయాల వీడియోను పంచుకుంటూ, ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న వారిపై ఢిల్లీ పోలీసులు పెలెట్ గన్స్ ఉపయోగించారని ఆరోపించారు.

అయితే ఢిల్లీ పోలీసులు ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.

ప్రశాంత నిరసనకారులపై పెలెట్ గన్స్ ఉపయోగించారన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, తమ వద్ద అలాంటి ఆయుధాలు లేవని, వాటిని వినియోగించే ప్రశ్నే లేదని ఎక్స్‌లో ప్రకటించారు.

ధృవీకరించని సమాచారం ఎవరూ పంచుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

న్యూఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు.

ఈ వివరణను పెలెట్ గన్స్ వాడినట్లు ఆరోపించిన అనేక పోస్టుల కామెంట్ విభాగంలో కూడా పోలీసులు పోస్టు చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆరోపణలను ఖండిస్తూ ఢిల్లీ పోలీస్ చేసిన ట్వీట్ 

వివరాలు 

ప్రశ్నాపత్రాల లీకేజీలు జరగకుండా ప్రభుత్వం చర్యలు

ఇదిలా ఉండగా, జూలై 20న జరిగిన నిరసనలో ఆర్‌ఏఎఫ్ పెలెట్ గన్స్ ఉపయోగించిందన్న మీడియా కథనాలను కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్‌పీఎఫ్) పరిశీలిస్తోందని ది హిందూ శుక్రవారం వెల్లడించింది.

ఈ వ్యవహారంపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా స్పందిస్తూ, పెలెట్ గన్స్ వాడారా అనే ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వలేదు.

యూనిఫామ్‌లో ఉన్న ఎవరైనా అతిగా ప్రవర్తించి ఉంటే దానిపైనా విచారణ జరుగుతుందని, చట్టమే అంతిమమని ఆయన స్కై న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ఇకపై ప్రశ్నాపత్రాల లీకేజీలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కూడా తెలిపారు.

వివరాలు 

ఉద్రిక్తంగా మారిన 'సంసద్ చలో' ర్యాలీ 

కాగా, జూలై 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజున సీజేపీ నిర్వహించిన 'సంసద్ చలో' ర్యాలీకి భారీగా నిరసనకారులు తరలివచ్చారు. అనంతరం పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

నిరసనకారులు పార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీచార్జి, టియర్ గ్యాస్ ప్రయోగించారు.

అనంతరం జరిగిన ఘర్షణల్లో పలువురు పోలీసులు, నిరసనకారులు గాయపడ్డారు.

పెలెట్ గన్స్ వినియోగంపై పరస్పర విరుద్ధ వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో అసలు నిజం ఏమిటన్నది అధికారిక దర్యాప్తు అనంతరం తేలాల్సి ఉంది.

ADVERTISEMENT