NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / పిండాన్ని గర్భంలోనే చంపేయని ఏ కోర్టు చెప్తుంది?: అబార్షన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
    తదుపరి వార్తా కథనం
    పిండాన్ని గర్భంలోనే చంపేయని ఏ కోర్టు చెప్తుంది?: అబార్షన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
    పిండాన్ని గర్భంలోనే చంపేయని ఏ కోర్టు చెప్తుంది?: అబార్షన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

    పిండాన్ని గర్భంలోనే చంపేయని ఏ కోర్టు చెప్తుంది?: అబార్షన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

    వ్రాసిన వారు Stalin
    Oct 11, 2023
    06:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఓ వివాహిత తన 26 వారాల గర్భాన్ని తొలగించుకోవడానికి దాఖలు చేసిన పిటషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

    ప్రసవానంతర డిప్రెషన్‌తో సహా ఆరోగ్య సమస్యలతో గర్భిణి బాధపడుతూ.. మూడో బిడ్డ పోషించడం కష్టమమవుతోందని ఓ మహిళ అబార్షన్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

    అయితే ఈ పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు అబార్షన్‌కు అనుమతిస్తూ సోమవారం తీర్పు చెప్పింది. అబార్షన్ చేయాల్సిందిగా ఎయిమ్స్‌ను ఆదేశించింది.

    ఈ క్రమంలో కడుపులోని పిండం ఆరోగ్యంగా ఉన్నట్లు, అబార్షన్ చేయడం వల్ల ఒక చిన్నారి ప్రాణాలను తీసినట్లు అవుతుందని ఎయిమ్స్‌ వైద్యులు ఏఎస్‌జీ ఐశ్వర్య భాటి వద్ద ఆందోళన వ్యక్తం చేశారు.

    ఏఎస్‌జీ ఐశ్వర్య భాటి ఇదే విషయాన్ని సీజఐ నేతృత్వంలోని ధర్మాసనానికి తెలియజేశారు.

    సుప్రీంకోర్టు

    పిండం ఆరోగ్యంగా ఉందని మొదటి నివేదికలో ఎందుకు చెప్పలేదు: ధర్మాసనం

    ఈ కేసును జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ బివి నాగరత్నతో కూడిన ధర్మాసనానికి సీజేఐ బదిలీ చేశారు.

    విచారణ సందర్భంగా ధర్మానసం ఎయిమ్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పిండం బతికే అవకాశం ఉందని ముందు ఇచ్చిన నివేదికలో ఎందుకు చెప్పలేదని ఎయిమ్స్‌ను జస్టిస్ కోహ్లి ప్రశ్నించారు.

    ఆబార్షన్‌కు సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత.. మళ్లీ నివేదికను మర్చి ఎందుకు ఇచ్చారని అడిగారు.

    ఏ కోర్టు కూడా కావాలని పిండం గుండె చప్పుడును ఆపాలనుకోదని జస్టిస్ హిమా కోహ్లి అన్నారు.

    సోమవారం నాటి విచారణలో ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది.

    చివరికి ఈ కేసు విచారణలో జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ నాగరత్న మధ్య ఏకాభిప్రాయం కుదరకపోడంతో సీజేఐకి సిఫార్సు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు
    తాజా వార్తలు

    తాజా

    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్
    Shilpa shirodkar: కొవిడ్‌ బారిన పడిన బాలీవుడ్‌ నటి శిల్పా శిరోద్కర్‌.. సోషల్‌ మీడియాలో పోస్టు  బాలీవుడ్

    సుప్రీంకోర్టు

    Manipur violence: మణిపూర్‌ హింసపై సుప్రీంకోర్టుకు నివేదికను సమర్పించిన జస్టిస్ మిట్టల్ కమిటీ మణిపూర్
    సీబీఐ కేసుల డేటాను వెల్లడించిన కేంద్ర విజిలెన్స్ కమిషన్... 20ఏళ్లు గడిచినా పూర్తికాని అవినీతి కేసులు  సీబీఐ
    లక్షద్వీప్ ఎంపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ; కేరళ హైకోర్టుకు కీలక ఆదేశాలు  కేరళ
    ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు..ఆ మాట ఆమోదయోగ్యం కాదని వెల్లడి భారతదేశం

    తాజా వార్తలు

    ప్రధాని మోదీని చంపేస్తాం: బెదిరింపు మెయిల్‌పై కేంద్ర ఏజెన్సీలు అప్రమత్తం  నరేంద్ర మోదీ
    సిక్కిం వరదలు: 56కి చేరిన మృతుల సంఖ్య.. 142మంది కోసం రెస్క్యూ బృందాల గాలింపు  సిక్కిం
    అమెరికా ప్రతీకారం.. ఇద్దరు రష్యన్ దౌత్యవేత్తలను బహిష్కరించిన అగ్రరాజ్యం  రష్యా
    ఇజ్రాయెల్‌‌లో యుద్ధ మేఘాలు.. గాజా నుంచి 5,000 రాకెట్లు ప్రయోగించిన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025