Page Loader
Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రాగానే మంచి నీటి బిల్లులు మాఫీ
ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రాగానే మంచి నీటి బిల్లులు మాఫీ

Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రాగానే మంచి నీటి బిల్లులు మాఫీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 04, 2025
01:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయానికే ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరో కీలక హామీ ఇచ్చారు. దిల్లీ ప్రజలకు మళ్లీ అధికారంలోకి రాగానే తప్పుడు మంచినీటి బిల్లులను మాఫీ చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం దిల్లీలో 20 వేల లీటర్ల ఉచిత మంచినీరు ప్రతినెలా అందించగా, 12 లక్షల కుటుంబాలు దీంతో లబ్ధి పొందుతున్నాయని చెప్పారు. తన జైలు వ్యవహారం సమయంలో ప్రజలకు అన్యాయంగా నీటి బిల్లులు పంపించారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ తప్పుడు బిల్లులు చూస్తూ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ తప్పులు సరిచేసి, తప్పుడు నీటి బిల్లులను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.

Details

అభివృద్ధి పనులను ప్రజలు గమనించాలి

దిల్లీ ప్రజలకు ప్రామిసు చేసినట్లుగా, ఏ విధమైన తప్పులుంటే వాటిని త్వరగా సరిచేస్తామని చెప్పారు. కేజ్రీవాల్ కాంగ్రెస్‌, బీజేపీపై కూడా విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీలు ఒకటిగా పోటీ చేస్తున్నాయో లేదో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని ఆయన కోరారు. బీజేపీకి దిల్లీ అభివృద్ధిపై ఏ స్పష్టమైన విజన్ లేదని, దిల్లీ సీఎం అభ్యర్థి ఎవరో తెలియదని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీపై విమర్శలు చేసే బీజేపీ, ప్రజలకు సరైన మార్గనిర్దేశం చేయలేకపోతుందని విమర్శించారు. ఆమ్ ఆద్మీ పార్టీ గత పదేళ్లలో చేసిన పనులను ప్రజలు గమనించాలని, ఆ పార్టీలో జరుగుతున్న కార్యక్రమాలు, వాగ్దానాలు చూశాకే ఓటు వేయాలని కేజ్రీవాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.