NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. రిటైర్డ్‌ ఉద్యోగులు తిరిగి విధుల్లోకి..!
    తదుపరి వార్తా కథనం
    Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. రిటైర్డ్‌ ఉద్యోగులు తిరిగి విధుల్లోకి..!
    రైల్వే శాఖ కీలక నిర్ణయం.. రిటైర్డ్‌ ఉద్యోగులు తిరిగి విధుల్లోకి..!

    Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. రిటైర్డ్‌ ఉద్యోగులు తిరిగి విధుల్లోకి..!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 19, 2024
    04:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సిబ్బంది కొరతను అధిగమించేందుకు భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

    దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో 25,000 ఉద్యోగాల కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది.

    ఈ నిమిత్తం, రిటైర్డ్ రైల్వే ఉద్యోగులకు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

    కొత్త నిబంధన కింద, సూపర్‌వైజర్ల నుండి ట్రాక్‌మెన్‌ వరకు అనేక ఉద్యోగాలకు రైల్వే నుండి రిటైర్‌ అయిన ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చు.

    అయితే, 65 సంవత్సరాల లోపు వారు మాత్రమే అర్హులని సమాచారం. వీరిని రెండు సంవత్సరాల పదవీకాలానికి నియమించుకోనున్నారు. అవసరమైతే, పదవీకాలాన్ని పొడిగించుకోవచ్చు.

    వివరాలు 

    జోనల్ రైల్వే జనరల్ మేనేజర్లకు ఉత్తర్వులు జారీ 

    కొత్త నిబంధన కింద, సూపర్‌వైజర్ల నుండి ట్రాక్‌మెన్‌ వరకు అనేక ఉద్యోగాలకు రైల్వే నుండి రిటైర్‌ అయిన ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చు.

    అయితే, 65 సంవత్సరాల లోపు వారు మాత్రమే అర్హులని సమాచారం. వీరిని రెండు సంవత్సరాల పదవీకాలానికి నియమించుకోనున్నారు. అవసరమైతే, పదవీకాలాన్ని పొడిగించుకోవచ్చు.

    ఈ నియామకాలకు సంబంధించి, అన్ని జోనల్ రైల్వే జనరల్ మేనేజర్లకు ఉత్తర్వులు జారీ చేసినట్లు కూడా కథనాల్లో వెల్లడించబడింది.

    రిటైర్డ్ ఉద్యోగులు గత ఐదేళ్ల మెడికల్ ఫిట్‌నెస్‌తో పాటు, పదవీ విరమణకు ముందు వారి పనితీరును పరిశీలించి నియామకాలు చేపట్టబడతాయి.

    గతంలో విజిలెన్స్ లేదా డిపార్ట్‌మెంట్ చర్యలను ఎదుర్కొన్న వారు దరఖాస్తులకు అనర్హులని సమాచారం.

    వివరాలు 

    వాయవ్య రైల్వే జోన్‌లోనే 10,000కు పైగా ఖాళీలు

    ఈ నియమింపబడిన వారికి, చివరిసారిగా వారు పొందిన నెలవారీ వేతనంలో నుండి బేసిక్ పింఛను తొలగించి జీతాలు చెల్లించబడతాయి.

    అంతేకాదు, ట్రావెల్ అలెవెన్స్‌లు, అధికారిక టూర్ల వంటి ప్రయోజనాలు కూడా అందించబడతాయి. అయితే, ఇంక్రిమెంట్ల వంటి ఇతర ప్రయోజనాలు వీరికి ఉండవని పేర్కొన్నారు.

    సిబ్బంది కొరతతో పాటు గత కొంతకాలంగా రైలు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో, బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    ప్రస్తుతం ఒక్క వాయవ్య రైల్వే జోన్‌లోనే 10,000కు పైగా ఖాళీలు ఉన్నాయి. మిగతా జోన్లలో కూడా పెద్ద ఎత్తున సిబ్బంది అవసరమని రైల్వే శాఖ వర్గాలు వెల్లడించాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రైల్వే బోర్డు

    తాజా

    operation sindoor: ఆపరేషన్‌ సిందూర్‌లో మా సైనికులు 11 మంది చనిపోయారు: పాక్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    Sunil Gavaskar: 2027 వన్డే వరల్డ్‌ కప్‌లో రోహిత్‌, విరాట్‌ ఆడరు: సునీల్‌ గావస్కర్‌ సునీల్ గవాస్కర్
    CBSE Class 12 results: సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల.. అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకొండి ఇలా.. సీబీఎస్‌ఈ
    China: వేధింపులు, ఆధిపత్య ధోరణితో ప్రపంచవ్యాప్తంగా ఒంటరి అవుతారు: జిన్‌పింగ్‌ జిన్‌పింగ్

    రైల్వే బోర్డు

    రైల్వే బోర్డు తొలి మహిళా సీఈఓగా జయవర్మ సిన్హా  జయవర్మ సిన్హా
    రైల్వే ఉద్యోగులకు కేంద్రం గుడ్​ న్యూస్​.. ఎంత శాతం డీఏ పెరిగిందో తెలుసా రైల్వే స్టేషన్
    IRCTC Site-App Down: IRCTC డౌన్.. యాప్, వెబ్‌సైట్‌ను ఉపయోగించడంలో ఇబ్బంది  టెక్నాలజీ
    Special Trians: తెలుగు రాష్ట్రాలకు రైల్వే గుడ్ న్యూస్.. వీకెండ్ లో ఈ నగరాల మధ్య 8 స్పెషల్ ట్రైన్స్  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025