NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pahalgam terror attack: పహల్గామ్‌లో హత్యకు గురైన నేవీ అధికారి భార్యపై ట్రోలింగ్; ఎన్‌సిడబ్ల్యు జోక్యం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Pahalgam terror attack: పహల్గామ్‌లో హత్యకు గురైన నేవీ అధికారి భార్యపై ట్రోలింగ్; ఎన్‌సిడబ్ల్యు జోక్యం
    పహల్గామ్‌లో హత్యకు గురైన నేవీ అధికారి భార్యపై ట్రోలింగ్; ఎన్‌సిడబ్ల్యు జోక్యం

    Pahalgam terror attack: పహల్గామ్‌లో హత్యకు గురైన నేవీ అధికారి భార్యపై ట్రోలింగ్; ఎన్‌సిడబ్ల్యు జోక్యం

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 05, 2025
    12:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గాం ఉగ్రదాడిలో మృతిచెందిన నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్‌ను సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.

    ఈ విషయంలో జాతీయ మహిళా కమిషన్‌ స్పందించింది.ఆమె సైద్ధాంతిక అభిప్రాయాన్ని తప్పుగా భావించి ట్రోల్‌ చేయడం అనైతికమని, అలా చేయడం సమంజసం కాదని పేర్కొంది.

    ఏప్రిల్ 22న పహల్గాములో జరిగిన ఉగ్రదాడిలో లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ ప్రాణాలు కోల్పోయారు.

    ఈ నేపథ్యంలో ఆయన భార్య హిమాన్షి,దేశంలో ఒక వర్గం వారిని టార్గెట్ చేసేలా వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

    కానీ, కొంతమంది నెటిజన్లు ఈ వ్యాఖ్యలను దురుద్దేశపూర్వకంగా తీసుకున్నారు. ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. దీనిపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ,కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశాయి.

    వివరాలు 

    ఉగ్రదాడిపై దేశం మొత్తం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది

    ఈ నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ స్పందిస్తూ, ''పహల్గాములో జరిగిన ఉగ్రదాడిలో అనేక కుటుంబాలు తీవ్ర దుఃఖానికి లోనయ్యాయి. లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్‌ను మతం పేరుతో హత్య చేశారు. ఈ ఉగ్రదాడిపై దేశం మొత్తం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ఆయన భార్య హిమాన్షి వ్యక్తం చేసిన అభిప్రాయంపై సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు కరెక్ట్ కాదు. ఆమె వ్యక్తిగత జీవితంపై వ్యాఖ్యలు చేయడం పూర్తిగా తప్పు. ఎలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు మర్యాదపూర్వకంగా, రాజ్యాంగ స్థితికి అనుగుణంగా ఉండాలి. జాతీయ మహిళా కమిషన్ ప్రతి మహిళ గౌరవాన్ని కాపాడే చర్యలు తీసుకుంటుంది'' అని తెలిపారు.

    వివరాలు 

    హనీమూన్‌కి జమ్మూ-కశ్మీర్‌కు..

    హరియాణాకు చెందిన వినయ్ ,హిమాన్షి 2025 ఏప్రిల్ 16న వివాహం చేసుకున్నారు.

    ఆ తర్వాత 19న విందు నిర్వహించి, హనీమూన్‌కి జమ్మూ-కశ్మీర్‌కు వెళ్లారు. యూరప్ వెళ్లాలని వారు ఆలోచించారు కానీ వీసాలు రిజెక్ట్ కావడంతో జమ్మూ-కశ్మీర్‌కు వెళ్లారు.

    ఈ సమయంలోనే ఈ ఉగ్రదాడి జరిగింది. పెళ్లై వారం కూడా గడవక ముందే.. , ఆమె జీవచ్ఛవంలా మారిన భర్తను చూసి హతాశురాలైంది. అంత్యక్రియల సమయంలో భర్తకు సెల్యూట్ చేస్తూ ఆమె రోదించిన తీరు ప్రతిఒక్కరిని బాధించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పహల్గాం ఉగ్రవాద దాడి

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    పహల్గాం ఉగ్రవాద దాడి

    Pahalgam Terror Attack: భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య.. మన దేశంలో ఈ వస్తువుల ధరలు పెరిగే అవకాశం.. వాటి వివరాలివే భారతదేశం
    Pahalgam Attack video: పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి వెలుగులోకి వచ్చిన కొత్త వీడియో.. తెలీకుండానే రికార్డ్‌ చేసిన టూరిస్ట్‌!  భారతదేశం
    Pakistani Nationals: భారత్- పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత.. పాక్ పౌరులు దేశం వీడేందుకు నేడే చివరి రోజు.. భారతదేశం
    Pahalgam attack: పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న పాకిస్తాన్ ఉగ్రవాది.. మాజీ స్పెషల్ ఫోర్స్ కమాండో  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025