NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 2024ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తా: మమత బెనర్జీ
    తదుపరి వార్తా కథనం
    2024ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తా: మమత బెనర్జీ
    2024ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తా: మమత బెనర్జీ

    2024ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తా: మమత బెనర్జీ

    వ్రాసిన వారు Stalin
    Mar 03, 2023
    02:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. తాను ఏ పార్టీతోనూ చేతులు కలపబోనని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించారు.

    టీఎంసీ ప్రజలతో పొత్తు పెట్టుకోనుందని, కాంగ్రెస్‌, కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా-మార్క్సిస్ట్‌(సీపీఐ-ఎం)లకు ఓటేస్తున్న వారు పరోక్షంగా అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి ఓటేస్తున్నారని ఆమె అన్నారు.

    పశ్చిమ బెంగాల్‌లోని సాగర్‌డిఘి ఉపఎన్నికలో కాంగ్రెస్ చేతిలో టీఎంసీ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో మమత చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

    అయితే మమతా బెనర్జీ తీసుకున్న ఈ నిర్ణయం వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాల మహా కూటమి అవకాశాలను బలహీనపరుస్తుంది.

    మమత

    బీజేపీ, కాంగ్రెస్‌, లెఫ్ట్‌ ఫ్రంట్‌ల మధ్య అనైతిక పొత్తు: మమత

    బీజేపీ, కాంగ్రెస్‌, లెఫ్ట్‌ ఫ్రంట్‌ల మధ్య అనైతిక పొత్తు ఉందని మమతా బెనర్జీ ఆరోపించారు.

    పార్టీలకు ఇచ్చిపుచ్చుకునే బంధం ఉందని, రానున్న రోజుల్లో టీఎంసీ వారి రాజకీయ నాటకానికి ముగింపు పలుకుతుందని చెప్పారు.

    సాగర్‌దిఘి ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ(ఎం)లు మతతత్వ కార్డును వాడారని ఆమె పేర్కొన్నారు. టీఎంసీ ఒంటరిగా బీజేపీని తరిమికొడుతుందని మమత ధీమా వ్యక్తం చేశారు.

    గురువారం వెలువడిన మేఘాలయ అసెంబ్లీ ఫలితాల్లో టీఎంసీ ఐదు స్థానాలను గెల్చుకున్నది. టీఎంసీ జాతీయ పార్టీగా అవతరించేందుకు ఇది దోహదపడుతుందని మమత అన్నారు.

    ఎన్నికలకు ఆరు నెలల ముందు మేఘాలయలో తమ పార్టీ ప్రచారం ప్రారంభించిందని, 15% ఓట్ షేరింగ్ సాధించి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిందని ఆమె అన్నారు

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మమతా బెనర్జీ
    పశ్చిమ బెంగాల్
    ఎన్నికలు

    తాజా

    Motivation: అవమానాలు తాత్కాలికం.. మీ విలువే శాశ్వతం! జీవితం
    MI vs DC: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ముంబై.. ఇంటిబాట పట్టిన ఢిల్లీ ముంబయి ఇండియన్స్
    Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం పాకిస్థాన్
    Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్ మాలీవుడ్

    మమతా బెనర్జీ

    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    12 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించిన బెంగాల్ ప్రభుత్వం: మమత పశ్చిమ బెంగాల్
    'తృణమూల్ కాంగ్రెస్' ట్విట్టర్ ఖాతా హ్యాక్; పేరు, లోగో మార్పు పశ్చిమ బెంగాల్

    పశ్చిమ బెంగాల్

    కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు కోవిడ్
    'జై శ్రీరామ్ అన్నందుకే ఈ దారుణం'.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలుపై రాళ్ల దాడి భారతదేశం
    పశ్చిమ బెంగాల్: అమెరికా నుంచి వచ్చిన నలుగురిలో బీఎఫ్-7 వేరియంట్ కరోనా కొత్త మార్గదర్శకాలు
    టీచర్స్ స్కామ్: 59 మంది ఉపాధ్యాయులను తొలగించాలని హైకోర్టు ఆదేశం భారతదేశం

    ఎన్నికలు

    ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు; ప్యానెల్ ఏర్పాటు సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025