తదుపరి వార్తా కథనం
Purandeswari: దిల్లీ గెలుపుతో దేశవ్యాప్తంగా కాషాయ జెండా రెపరెపలు: పురందేశ్వరి
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 09, 2025
12:49 pm
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి స్పందించారు.
దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కాషాయ జెండా రెపరెపలాడుతోందని ఆమె హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, 27 ఏళ్ల తర్వాత దిల్లీలో మళ్లీ అధికారంలోకి వచ్చామని, ఈ విజయానికి పార్టీ కార్యకర్తల కృషి ప్రధాన కారణమని ఆమె కొనియాడారు.
Details
గత ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోలేదు
అలాగే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై పురందేశ్వరి స్పందించారు.
గత ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు.
ఆ సమయంలో అభివృద్ధి అనే పదానికి తావే లేకుండా పోయిందన్నారు. వైసీపీ నేతలు రాష్ట్రాన్ని దోచుకోవడంపైనే దృష్టి సారించారంటూ ఆమె తీవ్ర విమర్శలు చేశారు.