Vijayawada: విజయవాడలో దారుణం.. భార్యను నడిరోడ్డుపై హత్య చేసిన భర్త
ఈ వార్తాకథనం ఏంటి
విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. భార్యను భర్తే నడిరోడ్డుపై దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు. మృతురాలు విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న సరస్వతిగా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. కుటుంబ విభేదాల కారణంగా భర్త, భార్య గత కొంతకాలంగా విడిగా జీవిస్తున్నారు. ఈ కలహాలపై ఆగ్రహం పెంచుకున్న భర్త, చివరికి ఆవేశానికి లోనై నడిరోడ్డుపై సరస్వతిని హత్య చేశాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
విజయవాడలో నడిరోడ్డుపై దారుణ హత్య
విజయవాడలో నడిరోడ్డుపై హత్యాయత్నం.
— greatandhra (@greatandhranews) November 13, 2025
విజయవాడలో విన్స్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్న సరస్వతిపై భర్త ఘోర దాడి చేశాడు.
గత కొన్ని నెలలుగా తరచూ భార్యాభర్తల మధ్య వివాదాలు జరుగుతున్నాయని సమాచారం.
ఈ ఉదయం నడిరోడ్డుపై సరస్వతిని కత్తితో కిరాతకంగా పొడవడం వల్ల ఆమె తీవ్రంగా గాయపడి… pic.twitter.com/Z0b7vy0DT2