
Ghaziabad: బాలికపై తల్లి ప్రియుడు అత్యాచారం, చిత్రహింసలు..ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
ఈ వార్తాకథనం ఏంటి
ఘజియాబాద్'లో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది.ఓ మహిళ తన ఇద్దరి పిల్లలతో స్థానికంగా నివాసం ఉంటుంది.
కొన్నేళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఆమె మరొకరితో సహజీవనం చేస్తోంది.అయితే,ఆమె లేని సమయంలో కామాంధుడు పదేళ్ల అమాయక బాలికపై చాలాసార్లు అత్యాచారానికి తెగబడ్డాడు.
అంతేకాకుండా ఆ బాలిక సోదరుడి(13)పై కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
ఈ విషయాన్ని పిల్లలు తల్లికి చెబితే..కామాంధుడికి బుద్ధి చెప్పాల్సింది పోయి..ఆ కసాయి తల్లి పిల్లల్నే చిత్రహింసలకు గురిచేసింది.
దీంతో ఆమె పెట్టె హింస తట్టుకోలేక పిల్లలిద్దరూ ఇంట్లో నుంచి పారిపోయారు.
ఆలా దిల్లీ వీధుల్లో తిరుగుతున్న బాలికను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
అనంతరం బాలికను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ(సీడబ్ల్యూసీ)కి అప్పగించారు.బాలిక వైద్య పరీక్షల్లో అత్యాచారం జరిగినట్లు తేలింది.
Details
వ్యభిచారం కూపంలోకి నెడుతుందన్నభయంతో..
ఆమె నుంచి పోలీసులు వివరాలు సేకరించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
బాలిక తండ్రి మరణం తరువాత,ఆమె తల్లి రాజు అనే వ్యక్తితో సహజీవనం చేస్తూ ఉండేది.తల్లి లేని సమయంలో బాలికపై రాజు పలుమార్లు అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
ఈ విషయాన్ని తల్లికి చెప్పిన ఆమె రాజుకే సపోర్ట్ చెయ్యడమే కాకుండా బిడ్డల్ని చిత్రహింసలకు గురి చేసింది.
దీంతో బాలుడు ముందుగా ఇంట్లో నుంచి పారిపోగా.. బాలిక మాత్రం జనవరి 20న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.
తన తల్లి ఎక్కడ తనను వ్యభిచారం కూపంలోకి నెట్టేస్తుందేమో అన్న భయంతో ఇంట్లో నుంచి పారిపోయినట్లు బాలిక పోలీసులకు తెలిపింది.
బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు..తల్లి,ప్రియుడు రాజును అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.