NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Women's Reservation Bill: ఎన్డీఏ, యూపీఏ మహిళా రిజర్వేషన్ బిల్లుల మధ్య తేడా ఏంటి? 
    తదుపరి వార్తా కథనం
    Women's Reservation Bill: ఎన్డీఏ, యూపీఏ మహిళా రిజర్వేషన్ బిల్లుల మధ్య తేడా ఏంటి? 
    ఎన్డీఏ, యూపీఏ మహిళా రిజర్వేషన్ బిల్లుల మధ్య తేడా ఏంటి?

    Women's Reservation Bill: ఎన్డీఏ, యూపీఏ మహిళా రిజర్వేషన్ బిల్లుల మధ్య తేడా ఏంటి? 

    వ్రాసిన వారు Stalin
    Sep 19, 2023
    05:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం సోమవారం ఆమోదం తెలిపింది. పార్లమెంట్ కొత్త భవనంలో జరిగిన తొలి సెషన్‍‌లో మంగళవారం లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సమావేశాల్లోనే మహిళా బిల్లును ఆమోదించనున్నారు.

    అయితే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇది తమ బిల్లు అని చెప్పారు.

    దీంతో యూపీఏ హయాంలో తీసుకొచ్చిని మహిళా రిజర్వేషన్ బిల్లుకు, ఇప్పుడు మోదీ ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లుకు తేడాలు ఏంటి అనే దానిపై చర్చ జరుగుతోంది.

    ఇప్పుడు ఆ తేడాల గురించి ఒకసారి తెలుసుకుందాం.

    మహిళ

    మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే ఏమిటి?

    మహిళా రిజర్వేషన్ బిల్లు, రాజ్యాంగం 108వ సవరణ బిల్లు, 2008 ప్రకారం, చట్ట సభల్లోని మొత్తం సీట్ల సంఖ్యలో మూడింట ఒక వంతు (33%) మహిళలకు రిజర్వ్ చేయాలని సూచిస్తుంది.

    కొత్త బిల్లు 33% కోటాలో ఎస్సీ, ఎస్టీలు, ఆంగ్లో-ఇండియన్‌లకు సబ్-రిజర్వేషన్‌ను కూడా ప్రతిపాదిస్తుంది.

    బిల్లు ప్రకారం, రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలోని వివిధ నియోజకవర్గాలకు రొటేషన్ ద్వారా రిజర్వ్‌డ్ స్థానాలు కేటాయించబడతాయి.

    ప్రస్తుత ప్రత్యేక సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టాలని అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వాని డిమాండ్ చేశాయి.

    దీంతో అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించి మరింత ఏకాభిప్రాయంతో బిల్లును తీసుకొచ్చామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

    మహిళ

    యూపీఏ వర్సెస్ ఎన్డీఏ బిల్లుల్లో తేడాలు!

    మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు తుది ముసాయిదా ఇంకా పూర్తిస్థాయిలో బయటకు రాలేదు.

    మోదీ ప్రభుత్వం రూపొందించిన బిల్లు, యూపీఏ హయాంలో తీసుకొచ్చిన బిల్లు కంటే మెరుగైనదని బీజేపీ నాయకులు చెబతున్నారు.

    మోదీ ప్రభుత్వం రాజ్యసభ, శాసన మండలిలోనూ రిజర్వేషన్‌ను కవర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

    లోక్‌సభ, శాసనసభలకు మాత్రమే వర్తించేలా యూపీఏ బిల్లును రూపొందించారు.

    కొత్త బిల్లులో ఓబీసీ కమ్యూనిటీని కూడా కవర్ చేసే అవకాశం ఉంది.

    ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేసిన సీట్లలో మూడో వంతు మహిళలకు రిజర్వ్ చేయబడుతుందని గతంలో యూపీఏ బిల్లు పేర్కొంది.

    అందులో ఓబీసీలను కూడా చేర్చాలని ఎస్పీ, ఆర్జేడీ పార్టీలు కోరాయి. కొత్త బిల్లులో ఓబీసీలను కూడా చేర్చినట్లు తెలుస్తోంది.

    మహిళ

    స్థానిక సంస్థల్లో కొనసాగుతున్న 33శాతం రిజర్వేషన్

    గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్లు కల్పించేందుకు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మే 1989లో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు.

    ఈ బిల్లు ద్వారా రాజకీయంగా మహిళా రిజర్వేషన్ బిల్లును మొదటిసారిగా ప్రతిపాదించారు.

    బిల్లు లోక్‌సభలో ఆమోదించబడినప్పటికీ, రాజ్యసభలో ఆమోదం పొందలేకపోయింది.

    1992లో పీవీ నరసింహారావు రాజ్యాంగ సవరణ బిల్లులు 72, 73లను తిరిగి ప్రవేశపెట్టారు.

    ఈ బిల్లు ద్వారా గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలలో మహిళలకు మూడింట ఒక వంతు (33%) రిజర్వ్ చేయబడింది.

    బిల్లు ఉభయ సభల్లో ఆమోదించారు. ఆ తర్వాత చట్టంగా మారింది. ప్రస్తుతం ఈ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కొనసాగుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహిళా రిజర్వేషన్‌ బిల్లు
    యూపీఏ
    నరేంద్ర మోదీ
    తాజా వార్తలు

    తాజా

    Vitamin D: పిల్లల నుంచి పెద్దల వరకూ... అందరికీ అవసరం 'డి విటమిన్‌'  జీవనశైలి
    Tirupati: తిరుపతిలో ఇంట్రా మోడల్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి శ్రీకారం.. శ్రీవారి ఆలయ శైలిలో డిజైన్‌ తిరుపతి
    RBI New Notes: మార్కెట్లోకి కొత్త నోట్లు.. ఆర్‌బీఐ కీలక ప్రకటన! సంజయ్ మల్హోత్రా
     Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం..  8మంది  మృతి చార్మినార్

    మహిళా రిజర్వేషన్‌ బిల్లు

    లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు.. 'చారిత్రక దినం'గా అభివర్ణించిన ప్రధాని మోదీ  లోక్‌సభ

    యూపీఏ

    PM Modi: యూపీఏ 'ఫోన్ బ్యాంకింగ్ స్కామ్'తో దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థ విచ్ఛిన్నం: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ

    నరేంద్ర మోదీ

    అవినీతి, కులతత్వం, మతతత్వానికి భారత్‌లో స్థానం లేదు: ప్రధాని మోదీ  ప్రధాన మంత్రి
    ముందస్తు ఎన్నికలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు  అనురాగ్ సింగ్ ఠాకూర్
    దేశంలో 'నరేంద్ర మోదీ' నమూనాకు రోజులు దగ్గర పడ్డాయ్: తమిళనాడు సీఎం స్టాలిన్  ఎం.కె. స్టాలిన్
    పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటి?: మోదీకి లేఖ రాయనున్న సోనియా గాంధీ సోనియా గాంధీ

    తాజా వార్తలు

    క్యాష్ ఆన్ డెలివరీ చెల్లింపులో రూ.2000 నోట్లను స్వీకరించం: అమెజాన్ ప్రకటన  అమెజాన్‌
    Gyanvapi case: హిందూ మతానికి సంబంధించిన వస్తువులను అప్పగించండి: సర్వే బృందానికి కోర్టు ఆదేశం  జ్ఞానవాపి మసీదు
    Anantnag encounter: అనంతనాగ్ ఎన్‌కౌంటర్‌లో మరో సైనికుడు వీరమరణం.. నాలుగుకు చేరిన మరణాలు  జమ్ముకశ్మీర్
    నుహ్ మత ఘర్షణ కేసులో హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్  హర్యానా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025