NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Women's Reservation Bill: ఎన్డీఏ, యూపీఏ మహిళా రిజర్వేషన్ బిల్లుల మధ్య తేడా ఏంటి? 
    Women's Reservation Bill: ఎన్డీఏ, యూపీఏ మహిళా రిజర్వేషన్ బిల్లుల మధ్య తేడా ఏంటి? 
    భారతదేశం

    Women's Reservation Bill: ఎన్డీఏ, యూపీఏ మహిళా రిజర్వేషన్ బిల్లుల మధ్య తేడా ఏంటి? 

    వ్రాసిన వారు Naveen Stalin
    September 19, 2023 | 05:06 pm 1 నిమి చదవండి
    Women's Reservation Bill: ఎన్డీఏ, యూపీఏ మహిళా రిజర్వేషన్ బిల్లుల మధ్య తేడా ఏంటి? 
    ఎన్డీఏ, యూపీఏ మహిళా రిజర్వేషన్ బిల్లుల మధ్య తేడా ఏంటి?

    చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం సోమవారం ఆమోదం తెలిపింది. పార్లమెంట్ కొత్త భవనంలో జరిగిన తొలి సెషన్‍‌లో మంగళవారం లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సమావేశాల్లోనే మహిళా బిల్లును ఆమోదించనున్నారు. అయితే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇది తమ బిల్లు అని చెప్పారు. దీంతో యూపీఏ హయాంలో తీసుకొచ్చిని మహిళా రిజర్వేషన్ బిల్లుకు, ఇప్పుడు మోదీ ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లుకు తేడాలు ఏంటి అనే దానిపై చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఆ తేడాల గురించి ఒకసారి తెలుసుకుందాం.

    మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే ఏమిటి?

    మహిళా రిజర్వేషన్ బిల్లు, రాజ్యాంగం 108వ సవరణ బిల్లు, 2008 ప్రకారం, చట్ట సభల్లోని మొత్తం సీట్ల సంఖ్యలో మూడింట ఒక వంతు (33%) మహిళలకు రిజర్వ్ చేయాలని సూచిస్తుంది. కొత్త బిల్లు 33% కోటాలో ఎస్సీ, ఎస్టీలు, ఆంగ్లో-ఇండియన్‌లకు సబ్-రిజర్వేషన్‌ను కూడా ప్రతిపాదిస్తుంది. బిల్లు ప్రకారం, రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలోని వివిధ నియోజకవర్గాలకు రొటేషన్ ద్వారా రిజర్వ్‌డ్ స్థానాలు కేటాయించబడతాయి. ప్రస్తుత ప్రత్యేక సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టాలని అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వాని డిమాండ్ చేశాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించి మరింత ఏకాభిప్రాయంతో బిల్లును తీసుకొచ్చామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

    యూపీఏ వర్సెస్ ఎన్డీఏ బిల్లుల్లో తేడాలు!

    మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు తుది ముసాయిదా ఇంకా పూర్తిస్థాయిలో బయటకు రాలేదు. మోదీ ప్రభుత్వం రూపొందించిన బిల్లు, యూపీఏ హయాంలో తీసుకొచ్చిన బిల్లు కంటే మెరుగైనదని బీజేపీ నాయకులు చెబతున్నారు. మోదీ ప్రభుత్వం రాజ్యసభ, శాసన మండలిలోనూ రిజర్వేషన్‌ను కవర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ, శాసనసభలకు మాత్రమే వర్తించేలా యూపీఏ బిల్లును రూపొందించారు. కొత్త బిల్లులో ఓబీసీ కమ్యూనిటీని కూడా కవర్ చేసే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేసిన సీట్లలో మూడో వంతు మహిళలకు రిజర్వ్ చేయబడుతుందని గతంలో యూపీఏ బిల్లు పేర్కొంది. అందులో ఓబీసీలను కూడా చేర్చాలని ఎస్పీ, ఆర్జేడీ పార్టీలు కోరాయి. కొత్త బిల్లులో ఓబీసీలను కూడా చేర్చినట్లు తెలుస్తోంది.

    స్థానిక సంస్థల్లో కొనసాగుతున్న 33శాతం రిజర్వేషన్

    గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్లు కల్పించేందుకు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మే 1989లో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ద్వారా రాజకీయంగా మహిళా రిజర్వేషన్ బిల్లును మొదటిసారిగా ప్రతిపాదించారు. బిల్లు లోక్‌సభలో ఆమోదించబడినప్పటికీ, రాజ్యసభలో ఆమోదం పొందలేకపోయింది. 1992లో పీవీ నరసింహారావు రాజ్యాంగ సవరణ బిల్లులు 72, 73లను తిరిగి ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ద్వారా గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలలో మహిళలకు మూడింట ఒక వంతు (33%) రిజర్వ్ చేయబడింది. బిల్లు ఉభయ సభల్లో ఆమోదించారు. ఆ తర్వాత చట్టంగా మారింది. ప్రస్తుతం ఈ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కొనసాగుతోంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    యూపీఏ
    నరేంద్ర మోదీ
    తాజా వార్తలు
    సోనియా గాంధీ
    కాంగ్రెస్
    లోక్‌సభ
    రాజ్యసభ

    తాజా

    మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు రాజ్యసభ పచ్చజెండా..తొలి బిల్లుతోనే సంచలనం సృష్టించిన కొత్త పార్లమెంట్ మహిళా రిజర్వేషన్‌ బిల్లు
    ఫాక్స్, న్యూస్ కార్ప్ చైర్మన్ పదవి నుంచి వైదొలగిన రూపర్ట్ మర్డోక్   వ్యాపారం
    'టైగర్ నాగేశ్వరరావు' సెకండ్ సాంగ్ రిలీజ్.. 'వీడు.. వీడు' అంటూ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించిన రవితేజ రవితేజ
    ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా స్వర్గధామమన్న భారత్.. ట్రూడో ఆరోపణలపై సాక్ష్యాలేవని నిలదీత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి

    యూపీఏ

    PM Modi: యూపీఏ 'ఫోన్ బ్యాంకింగ్ స్కామ్'తో దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థ విచ్ఛిన్నం: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ

    నరేంద్ర మోదీ

    పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్‌‌కు 'సంవిధాన్‌ సదన్‌' పేరు.. ప్రధాని మోదీ ప్రతిపాదన  పార్లమెంట్ కొత్త భవనం
    చారిత్రక సందర్భం.. అధికారికంగా భారత పార్లమెంట్‌గా మారిన కొత్త భవనం  పార్లమెంట్ కొత్త భవనం
    Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం  మహిళ
    ఫాక్స్‌కాన్ సంచలన ప్రకటన.. వచ్చే ఏడాది ప్రధాని మోదీకి అపూర్వ బహుమతి తైవాన్

    తాజా వార్తలు

    ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌‌పై 21వ తేదీకి వాయిదా  చంద్రబాబు నాయుడు
    కేరళ: అదుపులో నిపా వైరస్.. కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షల సడలింపు  కేరళ
    దెబ్బకు దెబ్బ.. కెనడా రాయబారిని బహిష్కరించిన భారత్  కెనడా
    భారత్, కెనడా మధ్య వివాదాన్ని రగిల్చిన ఖలిస్థానీ టెర్రరిస్ట్ నిజ్జర్ ఎవరు? కెనడా

    సోనియా గాంధీ

    తెలంగాణ: కాంగ్రెస్  విజయభేరి.. సోనియా గాంధీ ప్రకటించిన 6 హామీలు ఇవే  కాంగ్రెస్
    తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ 5 వరాలు..10 లక్షల మందితో సోనియా గాంధీ భారీ సభ కాంగ్రెస్
    పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ 9అంశాలపై చర్చించాలి: మోదీకి సోనియా గాంధీ లేఖ  పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023
    పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటి?: మోదీకి లేఖ రాయనున్న సోనియా గాంధీ కాంగ్రెస్

    కాంగ్రెస్

    రాబందుల రాజ్యమొస్తే రైతుబంధు రద్దు అవుతుంది: కాంగ్రెస్‌పై కేటీఆర్‌ విమర్శనాస్త్రాలు బీఆర్ఎస్
    విభేదాలు పక్కబెట్టాల్సిందే, గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగాలి : మల్లిఖార్జున ఖర్గే  హైదరాబాద్
    Tummala: BRSకు బిగ్‌ షాక్ .. తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా బీఆర్ఎస్
    హస్తం గూటికి తుమ్మల నాగేశ్వరరావు.. ఎప్పుడంటే? ఖమ్మం

    లోక్‌సభ

    PM Modi: పార్లమెంట్ పాత భవనం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకం: వీడ్కోలు పలికిన  ప్రధాని మోదీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    Parliament Special Session: నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. చర్చించే అంశాలు, ప్రవేశపెట్టే బిల్లులు ఇవే  పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023
    పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాను విడుదల చేసిన కేంద్రం.. కీలక బిల్లులపై చర్చ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023
    Adhir Ranjan Chowdhury: జమిలి ఎన్నికల కమిటీలో ఉండలేను: అమిత్ షాకు కాంగ్రెస్ ఎంపీ అధీర్ చౌదరి లేఖ  జమిలి ఎన్నికలు

    రాజ్యసభ

    One nation, one election: జమిలి ఎన్నికల కోసం 8మందితో కేంద్రం కమిటీ.. గెజిట్ నోటిఫికేషన్ జారీ  జమిలి ఎన్నికలు
    'ఒకే దేశం, ఒకే ఎన్నికలు'.. లాభమా, నష్టమా? లోక్‌సభ
    రాజ్యసభ సభ్యుల్లో అత్యధిక ధనవంతులు మన తెలుగోళ్లే ఎంపీ
    'దిల్లీ సర్వీసెస్ బిల్లు'కు రాష్ట్రపతి ఆమోదం; దేశ రాజధానికి ఇక కొత్త చట్టం దిల్లీ సర్వీసెస్ బిల్లు
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023