NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Uttarkashi tunnel: ఉత్తరాఖండ్‌ సొరంగం ప్రమాదం.. కొండచరియలు విరిగిపడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు అంతరాయం 
    తదుపరి వార్తా కథనం
    Uttarkashi tunnel: ఉత్తరాఖండ్‌ సొరంగం ప్రమాదం.. కొండచరియలు విరిగిపడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు అంతరాయం 
    Uttarkashi tunnel: ఉత్తరాఖండ్‌ సొరంగం ప్రమాదం.. కొండచరియలు విరిగిపడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు అంతరాయం

    Uttarkashi tunnel: ఉత్తరాఖండ్‌ సొరంగం ప్రమాదం.. కొండచరియలు విరిగిపడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు అంతరాయం 

    వ్రాసిన వారు Stalin
    Nov 15, 2023
    01:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి జాతీయ రహదారిపై సిల్క్యారా-దండల్‌గావ్ కూలిపోవడంతో కూలిపోయిన అందులో 40మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.

    కార్మికులను రక్షించేందుకు నాలుగు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే మంగళవారం రాత్రి కొండచరియలు విరిగిపడటంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది.

    కొండచరియల ధాటికి 'ఎస్కేప్ టన్నెల్'ను నిర్మించేందుకు ఏర్పాటు చేసిన డ్రిల్లింగ్ మిషన్ ప్లాట్‌ఫారమ్‌ దెబ్బతిన్నది. ఈ ప్రమాదంలో ఇద్దరు రెస్క్యూ వర్కర్లు గాయపడ్డారు.

    అయితే అగిపోయిన రెస్క్యూ పనులను కొనసాగించాలని తోటి కార్మికులు నిరసనకు దిగారు. తమ తోటి కార్మికులను రక్షించాలని డిమాండ్ చేసారు.

    ఉత్తరాఖండ్

    కార్మికులను బయటకు తీసుకొస్తాం: డీజీపీ

    కార్మికుల ఆందోళనపై ఉత్తరాఖండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్ స్పందించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌తో చర్చలు జరిగాయని, త్వరలో దిల్లీ నుంచి భారీ యంత్రాలను సంఘటనా స్థలానికి పంపిస్తామన్నారు.

    తద్వారా కార్మికులను సొరంగం నుంచి బయటకు తీసుకొస్తామని వివరించారు.

    రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న ఉత్తరకాశీ జిల్లా మేజిస్ట్రేట్ అభిషేక్ రుహేలా మాట్లాడుతూ.. భూమిని తవ్వే ఆగర్ యంత్రం 900 మిమీ వ్యాసం కలిగిన పైపులను ఉదయం సంఘటనా స్థలానికి తీసుకొచ్చనట్లు, సొరంగంలో 'డ్రిల్లింగ్'ను ప్రారంభించామని వివరించారు.

    అంతా ప్రణాళిక ప్రకారం జరిగితే, బుధవారం సాయంత్ర నాటికి కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొస్తామని వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తరాఖండ్
    తాజా వార్తలు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ఉత్తరాఖండ్

    50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    డేంజర్ జోన్‌లో జోషిమఠ్.. 678 భవనాలకు పగుళ్లు భారతదేశం
    జోషిమఠ్‌ సంక్షోభం: 'హిమాలయాల్లో చాలా పట్టణాలు మునిగిపోతాయ్'.. నిపుణుల హెచ్చరిక భారతదేశం
    ISRO: జోషిమఠ్‌ పట్టణంలో 12రోజుల్లో 5.4 సెం.మీ కుంగిన భూమి ఇస్రో

    తాజా వార్తలు

    Happy Diwali 2023: దీపావళి రోజున ఏం చేయాలి? అస్సలు చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం  దీపావళి
    Israel Hamas war: గాజా ఆసుపత్రుల నుంచి శిశువులను తరలించేందుకు మేం సిద్ధం: ఇజ్రాయెల్  ఇజ్రాయెల్
    Uttarakhand tunnel: ఉత్తరాఖండ్‌లో కూలిన సొరంగం.. శిథిలాల కింద చిక్కుకున్న 40 కార్మికులు ఉత్తరాఖండ్
    Ganga: ఇండస్ట్రీలో మరో విషాదం.. గుండెపోటుతో సీనియర్ హీరో మృతి కోలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025