Page Loader
Uttarkashi Tunnel: సొరంగంలో కార్మికుల వద్దకు రెస్క్యూ టీమ్.. 41మంది ఏ క్షణమైనా బయటకు రావచ్చు 
Uttarkashi Tunnel: సొరంగం నుంచి కార్మికులు ఎప్పుడైనా బయటకు రావచ్చు

Uttarkashi Tunnel: సొరంగంలో కార్మికుల వద్దకు రెస్క్యూ టీమ్.. 41మంది ఏ క్షణమైనా బయటకు రావచ్చు 

వ్రాసిన వారు Stalin
Nov 28, 2023
04:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలను రక్షించేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ దాదాపు సక్సెస్ అయ్యింది. మాన్యువల్ డ్రిల్లింగ్ విజయవంతమైన తర్వాత.. రెస్క్యూ టీమ్ సొరంగంలోకి కార్మికుల వద్దకు వెళ్లారు. దీంతో కార్మికులను రెస్క్యూ టీమ్ ఏ క్షణంలోనే బయటకు తీసుకురావొచ్చు. స్ట్రెచర్ల ద్వారా కార్మికులను ఒక్కొక్కటిగా సొరంగం నుండి బయటకు తీసుకురానున్నారు. రెస్క్యూ టీమ్ ఆపరేషన్ విజయవంతం కావడంపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. కోట్లాది మంది దేశప్రజల ప్రార్థనలు, రెస్క్యూ టీమ్ కృషి వల్ల కూలీలను బయటకు వస్తున్నారన్నారు. కార్మికుల కుటుంబాలు కార్మికుల దుస్తులతో సహా నిత్యావసర వస్తువులతో కూడిన బ్యాగులను సిద్ధంగా ఉండాలని అధికారులు ప్రకటించారు.

గేమ్

కార్మికుల కోసం ప్రత్యేక ఆసుపత్రి

చిన్యాలిసౌర్‌లోని కమ్యూనిటీ సెంటర్‌లో కూలీల కోసం ప్రత్యేక ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. వారిని ప్రత్యేక ఆసుపత్రికి తరలించేందుకు దాదాపు 30 కిలోమీటర్ల మేర గ్రీన్ కారిడార్‌ను నిర్మించారు. రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమైన అంబులెన్స్‌లు, వాహనాలు మాత్రమే ఈ మార్గంలో ప్రయాణించడానికి అనుమతించబడతాయి. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే హెలికాప్టర్లు కూడా అందుబాటులో ఉంటాయి. నవంబర్ 12 న, ఉదయం 5:00 గంటలకు, కొండచరియలు విరిగిపడటంతో యమునోత్రి జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న సిల్క్యారా-దండల్‌గావ్ సొరంగంలో ఒక భాగం అకస్మాత్తుగా కూలిపోయింది. దీంతో 8 రాష్ట్రాలకు చెందిన 41 మంది కార్మికులు సొరంగంలో చిక్కుకున్నారు.