LOADING...
Andhra News: విదేశాల్లో ఉన్నా ఇంటి పన్ను చెల్లించొచ్చు.. పారదర్శకత పెంచేలా పల్లెలకు డిజిటల్‌ సేవలు
పారదర్శకత పెంచేలా పల్లెలకు డిజిటల్‌ సేవలు

Andhra News: విదేశాల్లో ఉన్నా ఇంటి పన్ను చెల్లించొచ్చు.. పారదర్శకత పెంచేలా పల్లెలకు డిజిటల్‌ సేవలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 07, 2025
09:24 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, స్వగ్రామంలోని ఇల్లు సహా ఇతర భవనాల ఆస్తిపన్నును ఇప్పుడు ఆన్‌లైన్‌ ద్వారా సులభంగా చెల్లించుకోవచ్చు. పల్లెలకు డిజిటల్‌ సేవలను విస్తరించే లక్ష్యంతో రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'స్వర్ణ పంచాయతీ' సౌకర్యం ద్వారా ఈ ఆన్‌లైన్‌ పన్ను చెల్లింపు అవకాశం లభిస్తోంది.

వివరాలు 

దుర్వినియోగానికి అడ్డుకట్ట... 

గ్రామ పంచాయతీలకు పన్నుల రూపంలో వచ్చే నిధుల్లో పెద్ద మొత్తంలో అక్రమ వినియోగం జరుగుతోందని వచ్చిన అనేక ఫిర్యాదుల నేపథ్యంలో, ప్రభుత్వం పన్ను వసూళ్లలో పారదర్శకత తీసుకురావాలనే నిర్ణయం తీసుకుంది. దీని భాగంగా క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత చెల్లింపు వ్యవస్థను అమలు చేశారు. ఇందుకోసం పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది గ్రామ ఇళ్ల వివరాలు, నీటి పన్ను, ఆస్తిపన్ను తదితర సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. అధికారులు ఈ సేవ గురించి స్థానిక స్థాయిలో విస్తృత ప్రచారం చేస్తున్నారు.

వివరాలు 

పన్ను చెల్లించే విధానం: 

ముందుగా క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయాలి. అప్పుడు స్వర్ణ పంచాయతీ వెబ్‌సైట్‌ తెరుచుకుంటుంది. అందులో జిల్లా, మండలం, గ్రామంను ఎంచుకోవాలి. ఆపై చరవాణి సంఖ్య లేదా పేరుతో సెర్చ్‌ చేస్తే మీ పన్నుల బకాయి వివరాలు కనిపిస్తాయి. డిజిటల్‌ పేమెంట్‌ ద్వారా చెల్లింపు చేయవచ్చు. మీరు చెల్లించిన మొత్తం ప్రత్యక్షంగా పంచాయతీ ఖాతాలో జమ అవుతుంది. చెల్లింపు పూర్తయిన వెంటనే రసీదు వాట్సాప్‌ ద్వారా అందుతుంది.

వివరాలు 

పన్ను చెల్లింపులతో పాటు అందుబాటులో ఉన్న ఇతర సేవలు: 

వ్యాపార లైసెన్స్‌ల జారీ భవన నిర్మాణ అనుమతులు వివాహ ధ్రువీకరణ పత్రాలు జనన ధ్రువీకరణ పత్రాలు మరణ ధ్రువీకరణ పత్రాలు ఇలాంటివి ఇంకా అనేక సేవలను కూడా అదే వేదికలో పొందే అవకాశం ఉంది. జిల్లాలోని పంచాయతీలు : 729 అసెస్‌మెంట్లు : 4,75,474 ఏటా ఇంటి పన్ను డిమాండ్‌ : రూ.31.78 కోట్లు ప్రస్తుత బకాయిలు : రూ.14.44 కోట్లు